News February 28, 2025
బాపట్ల: మైనర్ బాలికపై అత్యాచారం

బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం ఎస్ఐ బండ్ల భార్గవ్ వివరాల ప్రకారం.. ఈనెల 25న ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా దగ్గరలో ఉన్న స్కూల్ బస్సులోకి లాక్కొని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
తాగునీటి సరఫరాకు ప్రణాళికను అమలు చేయాలి: కలెక్టర్

క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, తదితర అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ, తాగు నీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశంపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
News March 20, 2025
ALERT: ఆ జిల్లాల్లో ఉరుములు.. వడగండ్ల వానలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో <
News March 20, 2025
జనగామ కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామ కలెక్టరేట్లోని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో గురువారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హాజరై మాట్లాడుతూ.. ముస్లిం ఆచార సాంప్రదాయం ఆచరిస్తూ.. సమాజం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.