News March 19, 2025
బాపట్ల: రూ.149 కోట్ల పనులు మంజూరు

జలజీవన్ మిషన్ద కింద జిల్లాకు రూ.149 కోట్లతో 337 పనులు మంజూరు అయ్యాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 3, 2026
ఫొటో సిమిలర్ ఎంట్రీలు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీల ప్రక్రియను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో రివిజన్ మ్యాపింగ్ 56.87 శాతం పూర్తయిందన్నారు. ఓటరు జాబితా స్వచ్ఛత, పారదర్శకత కోసం ఈ ప్రక్రియ కీలకమని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి అర్హులైన ఓటర్ల వివరాలు సరిచేయాలని ఆదేశించారు.
News January 3, 2026
గోదావరి తీరంలో కన్నులపండువగా నది హారతి

భద్రాద్రి క్షేత్రంలో ‘ఏరు’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గోదావరి నది హారతి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కరకట్ట సమీపంలో పూజారులు నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళ హారతులు ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, వివిధ శాఖల అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నదీ తీరమంతా వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
News January 3, 2026
ధర్మపురి: 2027 గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

జూలై 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిని ఆధ్యాత్మిక పట్టణంగా అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. పుష్కర ఘాట్లు, రోడ్లు, ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, వసతి, సానిటేషన్ వంటి మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు.


