News April 16, 2025
బాపట్ల: రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి- కలెక్టర్

రెవెన్యూ సమస్యలపై ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దష్టి సారించాలన్నారు. పీజీఆర్ఎస్ సమస్యలను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలన్నారు.
Similar News
News April 20, 2025
ఎల్&టీ సంస్థకు LOA అందించిన సీఆర్డిఏ కమిషనర్

అమరావతిలో శాసనసభ భవన నిర్మాణ పనులు చేసేందుకు L1గా ఎల్ & టీ సంస్థ ఎంపికైంది. ఈ మేరకు శనివారం విజయవాడలోని CRDA కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు ఎల్ & టీ సంస్థ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ అవార్డు- LOA అందజేశారు. అమరావతిలో B+G+3 (బేస్మెంట్+ గ్రౌండ్+3) విధానంలో శాసనసభ భవనాలకు సంబంధించి రూ.617.33 కోట్ల పనులను ఎల్ & టీ చేపట్టనుంది.
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.
News April 20, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

:- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ 10వ తరగతి పరీక్షలు:-ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు :-సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన :-వేంసూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన :-ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు