News April 11, 2025
బాపట్ల: రేపే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఆత్రుత కనిపిస్తోంది. బాపట్ల జిల్లాలో ఫస్టియర్ 10,838, సెకండియర్ 8,381, మొత్తం 19,219 మంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News April 20, 2025
IPL PLAYOFFS: ఏ జట్టు ఎన్ని గెలవాలంటే?

IPL 2025లో అన్ని జట్లు కనీసం 7 మ్యాచులు ఆడాయి. దాదాపు అన్ని జట్లూ ప్లే ఆఫ్స్ పోటీలోనే ఉన్నాయి. GT 7 మ్యాచుల్లో 3, DC 7 మ్యాచుల్లో 3, PBKS 7 మ్యాచుల్లో 3, LSG 6 మ్యాచుల్లో 3, RCB 7 మ్యాచుల్లో 4, KKR 7 మ్యాచుల్లో 5, MI 7 మ్యాచుల్లో 5, SRH 7 మ్యాచుల్లో 6, CSK 7 మ్యాచుల్లో 6, RR 6 మ్యాచులకు ఆరు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News April 20, 2025
పెద్దపల్లి: రైలు ఢీకొని వ్యక్తి మృతి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. నిన్న రాత్రి సుమారుగా 11, 12 గంటల సమీపంలో గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పొత్కపల్లి గ్రామానికి చెందిన సుధగోని తిరుపతిగా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
టూత్ పేస్ట్లో హానికర సీసం, పాదరసం: లీడ్ సేఫ్ మామా

కొన్ని ప్రముఖ టూత్పేస్ట్ బ్రాండ్లలో విషపూరిత లోహాలు ఉన్నట్లు ‘లీడ్ సేఫ్ మామా’ సంస్థ అధ్యయనంలో తేలింది. 51 పేస్ట్ బ్రాండ్లను పరీక్షించగా వీటిలో చాలా బ్రాండ్లలో సీసం, ఆర్సెనిక్, మెర్క్యురీ, కాడ్మియం వంటి హానికర రసాయనాలు ఉన్నాయి. ఇవి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి. కాగా ఈ బ్రాండ్లన్నీ తమ పేస్టుల్లో ఎకో ఫ్రెండ్లీ వస్తువులు వాడుతున్నట్లు చెబుతున్నాయి.