News April 11, 2025
బాపట్ల వైసీపీ జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ నియామకం

బాపట్ల జిల్లా వైసీపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీగా పర్చూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కోట శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. తన మీద నమ్మకంతో ఆర్గనైజేషనల్ సెక్రటరీగా నియమించిన జగన్ మోహన్ రెడ్డికి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి గాదె మధుసూదన్ రెడ్డికి కోట శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News February 24, 2026
మెడిసిన్ చదవమన్నందుకు తండ్రినే చంపిన కొడుకు

లక్నోలో చదువు విషయంలో తలెత్తిన వివాదం ఘోర హత్యకు దారితీసింది. మెడిసిన్ చదవాలని తండ్రి ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన అక్షత్ ప్రతాప్ సింగ్ (21) తండ్రిని రైఫిల్తో కాల్చి చంపాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి చెల్లెలి ముందే వాటిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేశాడు. కొన్ని భాగాలను బయట పడేసి మిగిలిన వాటిని ఇంట్లోని డ్రమ్ములో దాచాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
News February 24, 2026
భూ కేటాయింపుల జోరు.. విద్యా, మౌలిక వసతులకు పెద్దపీట!

TG: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల కోసం భూములను కేటాయిస్తూ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోహెడలో లాజిస్టిక్స్ పార్క్ కోసం 223 ఎకరాలు, మహబూబాబాద్, హుస్నాబాద్లలో ఇంజనీరింగ్ కాలేజీలకు స్థలాలను కేటాయించింది. అలాగే 10 జిల్లాల్లో 21 యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. HYD ఎలివేటెడ్ కారిడార్ కోసం కాప్రాలో 153 ఎకరాలు, ఖమ్మంలో TTD ఆలయానికి 20 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
News February 24, 2026
భూ కేటాయింపుల జోరు.. విద్యా, మౌలిక వసతులకు పెద్దపీట!

TG: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల కోసం భూములను కేటాయిస్తూ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోహెడలో లాజిస్టిక్స్ పార్క్ కోసం 223 ఎకరాలు, మహబూబాబాద్, హుస్నాబాద్లలో ఇంజనీరింగ్ కాలేజీలకు స్థలాలను కేటాయించింది. అలాగే 10 జిల్లాల్లో 21 యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. HYD ఎలివేటెడ్ కారిడార్ కోసం కాప్రాలో 153 ఎకరాలు, ఖమ్మంలో TTD ఆలయానికి 20 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.


