News April 11, 2025

బాపట్ల వైసీపీ జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ నియామకం

image

బాపట్ల జిల్లా వైసీపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీగా పర్చూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కోట శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. తన మీద నమ్మకంతో ఆర్గనైజేషనల్ సెక్రటరీగా నియమించిన జగన్ మోహన్ రెడ్డికి, నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి గాదె మధుసూదన్ రెడ్డికి కోట శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

Similar News

News October 20, 2025

వరంగల్ ఉమ్మడి జిల్లా లిక్కర్ టార్గెట్ రూ.320.7 కోట్లు

image

ఉమ్మడి WGL జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో ప్రభుత్వం తొలిసారి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 23వ వరకు పొడిగించింది. 2023-25 టెండర్లలో 16,089 దరఖాస్తులతో రూ.318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-27కు శనివారం వరకు 9,754 దరఖాస్తులకు రూ.292.4 కోట్ల ఆదాయం లభించింది. గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు తగ్గాయి. రూ.320.7 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.

News October 20, 2025

పార్వతీపురంలో నేడు జరగాల్సిన పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

image

పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేడు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. దీపావళి పర్వదినం సందర్భంగా తాత్కాలింగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. వచ్చే వారం నుంచి యథావిధిగా వినతులు స్వీకరిస్తామన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి వేడుకలు జరుపుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు.

News October 20, 2025

చిత్తూరులో PGRS రద్దు

image

దీపావళి పండుగ కారణంగా సోమవారం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు ఎవరూ వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో సూచించారు.