News January 31, 2025
బాపట్ల: ‘వైసీపీ నిర్లక్ష్యంతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది’

గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమైందని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్, బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు చెప్పారు. గురువారం బాపట్లలోఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పు చేసి రూ.10 లక్షల కోట్లు భారం రాష్ట్రంపై పెట్టిందన్నారు. ఏడాదికి రూ.71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.
Similar News
News February 12, 2026
KNR: ‘సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి’

KNR మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. గర్భిణీలు, పిల్లల వార్డును సందర్శించి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడి సమావేశ మందిరంలో గైనకాలజిస్టులు, అనస్తీసియా, పిల్లల వైద్యులు, రేడియాలజిస్టులు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని వైద్య బృందానికి సూచించారు.
News February 12, 2026
అల్లూరి: రైతులకు అందుబాటులో డ్రోన్ సేవలు

రైతులకు అద్దె ప్రాతిపదికన డ్రోన్ల సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఉబెరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ యాప్ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో యాప్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేసి, తక్కువ ఖర్చుతో పంటలపై మందుల పిచికారీ, ఇతర వ్యవసాయ పనులకు డ్రోన్ సాంకేతిక ఎంతో అవసరమన్నారు. సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 12, 2026
NTR: KGBVలో కలకలం.. 11 మంది విద్యార్థినులకు ఎలుక కాటు!

ఏ.కొండూరులోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం రాత్రి కలకలం రేగింది. పాఠశాలలో నిద్రిస్తున్న 11 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు పాఠశాల లోపలే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.


