News March 20, 2025

బాపట్ల: వ్యవసాయ కళాశాలలో రైతులకు శిక్షణ

image

బాపట్ల ఆచార్యఎన్.జి రంగా వ్యవసాయ కళాశాలలో పురుగుమందుల వాడకంపై రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రసన్నకుమారి, కీటక శాస్త్ర విభాగం డీన్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రత్నకుమారి, పురుగు మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రభావం గురించి తెలిపారు. ఇంకొల్లు మండలానికి చెందిన కొనికి, హనుమాజి పాలెం, సూదివారిపాలెం గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Similar News

News September 14, 2025

KMR: అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్టు

image

కారు నెంబర్ ప్లేట్ మార్చి దొంగతనాలకు పాల్పడిన ఒక అంతర్‌రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. SP రాజేష్ చంద్ర వివరాలిలా..కామారెడ్డి వాసి శివారెడ్డి తాళం వేసిన ఇంటికి దొంగలు తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఇవాళ రాజస్థాన్ వాసి హన్సరాజ్ మీనాకు అదుపులో తీసుకొని అతని వద్ద నుంచి 2 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు SP వెల్లడించారు

News September 14, 2025

త్వరలో నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు: MP

image

త్వరలోనే నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం జరిగిన NZB చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి, రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు.

News September 14, 2025

రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యం: చంద్రబాబు

image

AP: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10.5% వృద్ధి సాధించినట్లు CM చంద్రబాబు వెల్లడించారు. ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమన్నారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్‌ను విశ్లేషిస్తున్నామన్నారు. 2029నాటికి రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యంగా పనిచేయాలన్నారు.