News March 17, 2025
బాపట్ల: సారా నిర్మూలనకు నవోదయం 2.0 ప్రారంభం

నాటుసారాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. సోమవారం బాపట్లలో అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని సారా రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందన్నారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రత్యామ్నాయం మార్గాలను చూపిస్తామన్నారు.
Similar News
News November 22, 2025
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్…!

ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని ఆర్ఐఓ కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. ఫస్ట్ ఇయర్కు సంబంధించి 22,265 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్కు సంబంధించి 19,163 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారన్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలతో కలిపి 183 కళాశాలలు ఉన్నాయని, ఫీజు చెల్లించని విద్యార్థులు రూ. 2 వేలు ఫైన్తో 25వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని ఆయన కోరారు.
News November 22, 2025
పార్లమెంటులో ‘అమరావతి’ బిల్లు: పెమ్మసాని

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించే గెజిట్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. CRDA కార్యాలయంలో మాట్లాడుతూ ‘రాజధాని రైతులకు 98% ప్లాట్ల పంపిణీ పూర్తయింది. మిగిలిన సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తాం. రాబోయే 15ఏళ్లలో జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం సదుపాయాలు కల్పిస్తాం’ అని వివరించారు.
News November 22, 2025
బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని బిట్స్ పిలానీ 4 కేర్ టేకర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.bits-pilani.ac.in/


