News February 13, 2025
బాపట్ల: స్కానింగ్ సెంటర్లను నిరంతరం తనిఖీ చేయాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739446364839_51982755-normal-WIFI.webp)
స్కానింగ్ సెంటర్లను వైద్యశాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని బాపట్ల ఆర్డీవో గ్లోరియా చెప్పారు. గురువారం బాపట్ల ఆర్డీవో కార్యాలయం నందు సబ్ డిస్ట్రిక్ లెవల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News February 14, 2025
మెదక్: చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739459836182_19780934-normal-WIFI.webp)
నర్సాపూర్ మండలం ఎర్రకుంట తండాలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈనెల ఒకటో తేదీన శ్రీను ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడగా, కేసు నమోదు చేసిన పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు బాధితుడి అన్న కొడుకు మూడవ అంజ్యాను అరెస్టు చేసి అతని నుంచి రూ.2.60లక్షల నగదుతో పాటు వెండి పట్టగొలుసులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ జాన్ రెడ్డి తెలిపారు.
News February 14, 2025
నర్సాపూర్ (జి): వ్యక్తిపై హత్య ప్రయత్నం కేసు నమోదు: SI
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739466777659_52013399-normal-WIFI.webp)
పాత కక్షలతో ఓ వివాహితను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన గురువారం నర్సాపూర్(జి) మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై సాయి కిరణ్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం ఎల్లన్న పాత కక్షలు మనసులో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో పొడిచాడు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
News February 14, 2025
సిరిసిల్ల: పిల్లలకు భయం పోగొట్టేందుకు SPECIAL క్లాసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739445260015_52088599-normal-WIFI.webp)
జిల్లాలోని షెడ్యూల్డ్, వెనుకబడిన తరగతుల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు భయం పోగొట్టడానికి సిరిసిల్ల పట్టణంలోని టీజీఎస్సీ స్టడీ సర్కిల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజ మోహన్ రావు తెలిపారు. ఆసక్తికర విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే తరగతులకు హాజరుకావాలని ఆయన కోరారు.