News June 23, 2024
బాపట్ల: 24న మొదలవనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ నెల 24వ తేదీన సోమవారం మొదలవుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం పని దినాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా రాసుకొని కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
Similar News
News October 16, 2025
అమరావతి రైతులకు ముఖ్య సూచన

అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం తుళ్లూరులోని CRDA కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే గ్రీవెన్స్ డేను రైతులు, అమరావతి ప్రాంతవాసులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. భూములిచ్చిన రైతుల సమస్యలను “గ్రీవెన్స్ డే” ద్వారా CRDA అధికారుల దృష్టికి తీసుకురావొచ్చు అని అన్నారు.
News October 16, 2025
గుంటూరు జిల్లాలో 173 న్యూసెన్స్ కేసులు: ఎస్పీ

గుంటూరు జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్లో అనవసరంగా తిరుగుతున్న 181 మందిపై 173 న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఓపెన్ డ్రింకింగ్, రోడ్లపై అనవసరంగా తిరుగుతూ, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
News October 16, 2025
పెట్టుబడి వ్యయం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

వ్యవసాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ రంగాల్లో పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడులు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం కలక్టరేట్లో అధికారులతో సమీక్ష చేశారు. సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాయితీల వివరాలను రైతులకు వివరించాలని చెప్పారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు అభివృద్ధి సాధించేలా కృషి చేయాలన్నారు.