News April 29, 2024
బాలయ్య రాకతో జనసంద్రమైన చిత్తూరు గాంధీ సర్కిల్

స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా చిత్తూరుకు విచ్చేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చిత్తూరు ప్రజలు ఘన స్వాగతం పలికారు. బాలయ్య రాకతో చిత్తూరు గాంధీ సర్కిల్ జనసంద్రమైంది. బాలయ్య మాట్లాడుతూ.. సైకో జగన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మంచి చేకూరుతుందని అన్నారు.
Similar News
News October 22, 2025
చిత్తూరు CDCMS పర్సన్ ఇన్ఛార్జ్ జేసీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(CDCMS)కి అఫిషియల్ పర్సన్ ఇన్ఛార్జ్గా జాయింట్ కలెక్టర్ విద్యాధరిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీ వరకు లేదా తిరిగి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. గతంలో నియమించిన సుబ్రహ్మణ్యం నాయుడు మృతిచెందిన సంగతి తెలిసిందే.
News October 22, 2025
చిత్తూరు జిల్లాకు ఆరంజ్ అలర్ట్

చిత్తూరు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జిల్లా అంతట మంగళవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటలు నీట మునిగి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలకు సైతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
News October 22, 2025
చిత్తూరు: పాఠశాలలకు సెలవు

రెండు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. అలాగే రేపు పాఠశాలలకు సెలవులు సెలవులు ప్రకటిస్తూ ఎంఈవోలకు డీఈవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.