News February 24, 2025
బాలానగర్: అక్కతో గొడవ.. చెల్లి SUICIDE

ఉరేసుకుని నర్సింగ్ <<15558439>>విద్యార్థి <<>>ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నకూతురు సింధు(17) షాద్నగర్లో నర్సింగ్ చదువుతోంది. కాగా, ఆదివారం రెండో అక్కతో సింధుకి గొడవైంది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News December 6, 2025
సమాచార హక్కు చట్టం.. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం: కలెక్టర్

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాల వేడుకలు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయిందని, సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అన్నారు. అధికారులు నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వాలని నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే పరిస్థితి సీరియస్ అవుతుందని పేర్కొన్నారు.
News December 6, 2025
NTR: SSC నామినల్ రోల్స్ ఎడిట్ ఆప్షన్

యూడైస్ ప్లస్ పోర్టల్లో SSC నామినల్ రోల్ విద్యార్థుల పరీక్ష వివరాల సవరణ కోసం ఎడిట్ ఆప్షన్ డిసెంబర్ 6న అందుబాటులోకి వచ్చిందని ఉప విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్రావు తెలిపారు. సబ్జెక్టులు, సీడబ్ల్యూఎస్ఎన్ స్థితి, ఫోటోలు, సంతకం వంటి లోపాలను సరిచేయాలని ఆయన సూచించారు. యూడైస్ ప్లస్లో చేసిన మార్పులు 24 గంటల్లో బీఎస్ఈ పోర్టల్లో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయని స్పష్టం చేశారు.
News December 6, 2025
దంపతులకు దత్తత ఫైనల్ ఆర్డర్ అందజేసిన కలెక్టర్

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఫ్రీ అడాప్షన్ పోర్టల్ ద్వారా 8నెలల చరణ్ బాబుకు తుది దత్తత ఆర్డర్ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అందజేశారు. మహబూబ్నగర్కు చెందిన దంపతులకు ఈబిడ్డను దత్తత ఇచ్చారు. బాబును చూసుకునే విధానం, పోషణ, ఇమ్యునైజేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, దత్తత తీసుకున్న వారిని సొంత తల్లిదండ్రులుగా గుర్తించి ఫైనల్ ఆర్డర్ ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.


