News February 24, 2025
బాలానగర్: అక్కతో గొడవ.. చెల్లి SUICIDE

ఉరేసుకుని నర్సింగ్ <<15558486>>విద్యార్థి <<>>ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నకూతురు సింధు(17) షాద్నగర్లో నర్సింగ్ చదువుతోంది. కాగా, ఆదివారం రెండో అక్కతో సింధుకి గొడవైంది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 12, 2025
నల్గొండకు మరో అరుదైన గౌరవం

ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ (S&T) ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో చురుకుగా ఉన్న నల్గొండ జిల్లా యంత్రాంగానికి అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (PSA) కార్యాలయం ఢిల్లీలో డిసెంబర్లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ‘S&T క్లస్టర్స్: మేకింగ్ లైవ్స్ ఈజియర్’ అంశంపై జరిగే ఈ సదస్సు ఆహ్వానం కలెక్టర్కు అందింది.
News November 12, 2025
IT కారిడార్లకు త్వరలో స్కైవాక్లు, మోనో రైలు!

TG: IT కారిడార్లలోని లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మోనో రైలుకు అనుసంధానించేలా స్కైవాక్లు నిర్మించాలని యోచిస్తోంది. దీనికి కమర్షియల్ బిల్డింగ్ ఓనర్స్ పర్మిషన్ తప్పనిసరి. స్కైవాక్లను CSR ఫండ్స్ ద్వారా, మోనో రైలును PPP మోడల్లో నిర్మిస్తారు. త్వరలోనే CM రేవంత్ నుంచి దీనికి ఆమోదం వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు Way2Newsకు తెలిపారు.
News November 12, 2025
ఆర్మూర్: బ్రిడ్జి పనుల్లో జాప్యం.. దుమ్ము ధూళితో శ్వాసకోశ ఇక్కట్లు

ARMR- NZB వెళ్లే మార్గంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జిపై కంకర వేసి, నీరు కొట్టకపోవడం వల్ల భారీగా దుమ్ము, ధూళి పైకి లేస్తోంది. ఈ ధూళి కళ్లు, ముక్కులోకి చేరడం వల్ల వాహనదారులు, అడవి మామిడిపల్లి గ్రామస్థులు తీవ్రశ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వెంటనే రోడ్డుపై తారువేసే పనులను ప్రారంభించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.


