News February 24, 2025

బాలానగర్‌: అక్కతో గొడవ.. చెల్లి SUICIDE

image

ఉరేసుకుని నర్సింగ్ <<15558470>>విద్యార్థి <<>>ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నకూతురు సింధు(17) షాద్‌నగర్‌లో నర్సింగ్ చదువుతోంది. కాగా, ఆదివారం రెండో అక్కతో సింధుకి గొడవైంది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News February 24, 2025

ఉప ఎన్నికలు ఎలా వస్తాయి?: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో గత పదేళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘గతంలో TDP, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను BRSలో చేర్చుకోలేదా? వారిని మంత్రులను చేయలేదా? అప్పుడు రాని ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి. అప్పటి కోర్టులే కదా ఇప్పుడు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు తరచుగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే.

News February 24, 2025

ఏసీబీకి చిక్కిన అన్నమయ్య జిల్లా అధికారి 

image

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో జౌళి శాఖ అధికారి కృష్ణయ్య పడ్డాడు. అన్నమయ్య జిల్లా, రాయచోటిలో చేనేత జౌళి శాఖ జిల్లా అధికారి కృష్ణయ్య సోమవారం లబ్ధిదారుల నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ విజయ కుమారి ఆదేశాలతో కడప ఏసీబీ డీఎస్పీ జెస్సి ప్రశాంతి, సీఐలు జిల్లా జౌళి శాఖ అధికారి కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ విజయకుమారి తెలిపారు.

News February 24, 2025

CRICKET: ఈ రోజు చాలా స్పెషల్ గురూ..

image

క్రికెట్ చరిత్రలో వేర్వేరు సంవత్సరాల్లో ఈ రోజు(FEB 24)న పలు రికార్డులు నమోదయ్యాయి. 2010లో సౌతాఫ్రికాపై వన్డేల్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశారు. అంతర్జాతీయ వన్డేల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. 2013లో మిస్టర్ కూల్ ధోనీ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచారు. ఇక 2015లో విండీస్ క్రికెటర్ గేల్ వన్డే వరల్డ్ కప్‌లో ద్విశతకం బాదిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కారు.

error: Content is protected !!