News February 24, 2025
బాలానగర్: అక్కతో గొడవ.. చెల్లి SUICIDE

ఉరేసుకుని నర్సింగ్ <<15558470>>విద్యార్థి <<>>ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నకూతురు సింధు(17) షాద్నగర్లో నర్సింగ్ చదువుతోంది. కాగా, ఆదివారం రెండో అక్కతో సింధుకి గొడవైంది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News December 22, 2025
గోదావరి పుష్కరాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధంచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. గోదావరి పుష్కరాలు 2027 జూన్లో నిర్వహించనున్నట్లు పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 29 స్నానఘట్టాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత పుష్కరాల కన్నా రెట్టింపు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News December 22, 2025
విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచండి: కలెక్టర్

విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్)ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయికి వెళ్లాలని కోరారు.
News December 22, 2025
అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజలు అందించిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించి నివేదిక అందజేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


