News April 13, 2025
బాలానగర్ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

బాలానగర్లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్లో ఉన్న వెహికిల్ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 6, 2026
అతిగా దుస్తులు కొంటున్నారా?

‘ఫాస్ట్ ఫ్యాషన్’ పేరుతో మనం కొంటున్న దుస్తులు పర్యావరణానికి శాపంగా మారుతున్నాయి. ఏటా వెలువడుతున్న క్లాతింగ్ వేస్ట్ సముద్రాలను, నేలను విషతుల్యం చేస్తున్నాయి. మనం ధరించే ఒక్క జత బట్టల తయారీకి ఎన్నో లీటర్ల నీరు ఖర్చవుతుంది. అందుకే అవసరముంటేనే దుస్తులు కొనండి. ఉన్నవాటిని ఎక్కువ కాలం వాడండి. ఫ్యాషన్ కోసం ప్రకృతిని కలుషితం చేయకండి. బాధ్యతగా బట్టలు కొందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం. SHARE IT
News January 6, 2026
చివరి టెస్టు.. పట్టు బిగించిన ఆసీస్

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ 384 పరుగులకు ఆలౌటవగా, ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 518/7 స్కోర్ చేసింది. దీంతో 134 పరుగుల లీడ్ సాధించింది. హెడ్ 163, స్టీవ్ స్మిత్ 129* అద్భుత సెంచరీలు చేశారు. కార్సే 3, స్టోక్స్ 2, జోష్, జాకోబ్ చెరో వికెట్ తీశారు. కాగా ఇప్పటికే 3-1 తేడాతో ఆసీస్ సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
News January 6, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,160
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,027
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.


