News April 13, 2025
బాలానగర్ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

బాలానగర్లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్లో ఉన్న వెహికిల్ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 7, 2026
BCCIపై మొయిన్ అలీ పరోక్ష ఆరోపణలు

IPL నుంచి ముస్తాఫిజుర్ను <<18748860>>తప్పించడాన్ని<<>> ENG క్రికెటర్ మొయిన్ అలీ తప్పుబట్టారు. ‘ఎన్నో ఏళ్ల కష్టానికి అతనికి ఈ కాంట్రాక్టు దక్కింది. ఇలా తప్పించడంతో ఎక్కువగా నష్టం జరిగేది అతడికే. పాలిటిక్స్ క్రికెట్ను ప్రమాదంలో పడేస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపాలి. ఇలాంటి సమస్యలపై AUS, ENG బోర్డులు ఎందుకు మాట్లాడవు. ICCని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసు’ అంటూ BCCIపై పరోక్ష ఆరోపణలు చేశారు.
News January 7, 2026
MHBD: ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న భూక్య సుధాకర్ డ్యూటీలో ఉండగా దాడి చేసిన ఎండి షారుక్ను అరెస్టు చేసినట్లు టౌన్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. గత నెల 14న విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ సుధాకర్ బస్సును వెనుక నుంచి ఆటో నడుపుతున్న షారుక్ అజాగ్రత్తగా ఢీకొట్టాడు. ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ రవిపై, ఆటో డ్రైవర్ షారుక్ దాడి చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
News January 7, 2026
నల్లగొండ: దొంగతనాలపై ఉక్కుపాదం: ఎస్పీ శరత్ చంద్ర

జిల్లాలో చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం పాత నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆయన ప్రవర్తన మార్చుకోని వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు రాత్రి గస్తీ పెంచినట్లు పేర్కొన్నారు. నేరాలు వదిలేసిన వారికి అండగా ఉంటామని తెలిపారు.


