News April 13, 2025
బాలానగర్ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

బాలానగర్లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్లో ఉన్న వెహికిల్ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 4, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన నవీన్ రావు విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు సిట్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటలకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. SIB మాజీ అధికారులతో సంబంధాలపై ఆరా తీశారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే వేధిస్తున్నారని విచారణ అనంతరం నవీన్ రావు ఆరోపించారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని, ఇది బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న దాడి అని అభివర్ణించారు.
News January 4, 2026
BCB రిక్వెస్ట్.. శ్రీలంకలో బంగ్లా మ్యాచులు!

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఇరు దేశాల మధ్య <<18748860>>క్రికెట్పై<<>> ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో T20WCలో తమ మ్యాచులు భారత్ నుంచి మార్చాలని BCB రిక్వెస్ట్ చేసింది. దీనిపై ICC సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజ్లో భారత్లో జరగాల్సిన బంగ్లా మ్యాచులను శ్రీలంకకు మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే 48గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని క్రిక్ బజ్ పేర్కొంది.
News January 4, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

♦︎బారువ హైవేపై రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
♦︎SKLM: 108పై దుష్ప్రచారాలు మానుకోవాలి
♦︎దేశంలో మొదటిసారిగా ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గింపు: అచ్చెన్న
♦︎టెక్కలి: మద్యం మత్తులో చనిపోతానంటూ వ్యక్తి హల్చల్
♦︎కంచిలి: రైలు పైకెక్కి వ్యక్తి హల్చల్
♦︎ఉత్తరాంధ్ర అభివృద్ధికి బీజం పడింది: రామ్మెహన్
♦︎ పొందూరులో నూతన డీటీఎఫ్ కార్యవర్గం ఎంపిక


