News August 30, 2024

బాలాపూర్‌ గణేశ్ Aagman-2024

image

హైదరాబాద్ వాసులే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే వినాయకచవితి సమీపిస్తోంది. నవరాత్రులకు మరో వారం రోజులే సమయం ఉండడంతో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి వారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గురువారం Aagman-2024‌ను నిర్వహించారు. ధూల్‌పేట నుంచి మధ్యాహ్నం బయల్దేరిన భారీ గణనాథుడు సాయంత్రానికి బాలాపూర్‌‌లోని మండపం‌ వద్దకు చేరుకున్నాడు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

Similar News

News September 16, 2025

HYD: పూడిక తీయండి.. సమస్య తీర్చండి!

image

నగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి చాలాచోట్ల వరదనీరు నిలిచిపోతోంది. కారణం ఆయా ప్రాంతాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడమే. ఇలాంటి 40 ప్రాంతాలను హైడ్రా గుర్తించింది. అక్కడ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను యుద్ధప్రాతిపదికన తొలగించడానికి  హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నడుంబిగించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పూడిక తొలగిస్తే వరదనీటి సమస్యకు పరిష్కారం లభించినట్లవుతుంది.

News September 16, 2025

MGBS మెట్రో స్టేషన్‌లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రం

image

దేశంలోనే పాస్‌పోర్ట్ జారీలో 5వ స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని MP అసదుద్దీన్ ఒవైసీ, MP అనిల్ కుమార్ యాదవ్, MLC రియాజుల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలసి మంత్రి ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి మెట్రోలో ప్రారంభమైన పాస్ పోర్ట్ కేంద్రం ఇదే అని ఆయన వెల్లడించారు.

News September 16, 2025

HYD: నాన్న.. నీవెక్కడ?

image

నాన్న రాక కోసం ఆ బాలుడు ఎదురుచూపులు ఆపడం లేదు. గుండెకు హత్తుకొని లాలించే తండ్రి కనిపించక చిన్నోడు వెక్కివెక్కి ఏడుస్తోండు. వరదలో గల్లంతైన కొడుకు కోసం తల్లి, భర్త జాడెక్కడా? అని భార్య కన్నీరుపెట్టుకుంటోంది. వినోభానగర్‌లో వరదల్లో కొట్టుకుపోయిన సన్నీ ఫ్యామిలీ విషాద గాథ ఇది. వరదల్లో కొట్టుకుపోయిన అతడి ఆనవాళ్లు 40 గంటలైనా తెలియలేదు. ఆకలి, దూప వదిలి కుటుంబీకులు నాలాల వద్ద పడిగాపులు కాయడం బాధాకరం.