News November 3, 2024
బాలాయపల్లి: జయంపు గ్రామంలో ఉద్రిక్తత

బాలాయపల్లి మండలం, జయంపు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివారెడ్డి జనార్దన్ రెడ్డి ఇంటిపై అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. శివారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను అమానుషంగా కొట్టి గాయపరిచారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 25, 2025
తిరుమలలో నెల్లూరు జిల్లా కలెక్టర్… జిల్లా ప్రధాన న్యాయమూర్తి

తిరుమలలో గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం సందర్భంగా అనుకోకుండా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ కలుసుకున్నాను. వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేలా స్వామివారి కృప కటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
News December 25, 2025
ఉదయగిరి: హనీఫ్ మాస్టర్ ఇక లేరు..!

ఉదయగిరికి చెందిన ‘ఉర్దూ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్’ గ్రహీత షేక్ మహమ్మద్ హనీఫ్ ఖాలిది(77) ఇక లేరు. బుధవారం రాత్రి ఆయన అనారోగ్య సమస్యలతో మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. ఆయన జీవితాంతం ఉర్దూ భాష అభివృద్ధికి ఎనలేని సేవలందించారు. అనేక మంది పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించారు. ఆయన ఎంతో శ్రమించి రచించిన “ఉదయగిరి మహనీయులు” పుస్తకం విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో మృతి చెందడం బాధాకరం.
News December 25, 2025
కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలి: జేసీ

కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి ఆధునిక, సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కుల గురించి అవగాహన ఎంతో ముఖ్యమని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ వినియోగదారుల దినోత్సవానికి “డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం” అనే ఇతివృత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


