News October 30, 2024
బాలికను పెళ్లి చేసుకుని వేధిస్తున్న భర్త.. పోక్సో కేసు నమోదు

విజయవాడలో ఓ మైనర్ బాలికను వేధించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడలో ఉంటున్న 9వ తరగతి విద్యార్థిని(14)పై మేనమామ వరసైన సూరిబాబు మాయమాటలతో 2022లో అత్యాచారం చేయడంతో, పెద్దలు పెళ్లి చేశారు. 2ఏళ్లు గడవకముందే అత్తమామలు, భర్త వేధించడంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. బాలికకు 16ఏళ్లు కావడంతో గుణదల పోలీసులు పోక్సో, అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 17, 2025
కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార చర్యలపై కొంత మంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణకు ముందు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రీ ఓపెన్ అర్జీలు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేక చేసే తప్పుల వల్లే అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయన్నారు.
News November 17, 2025
కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార చర్యలపై కొంత మంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణకు ముందు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రీ ఓపెన్ అర్జీలు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేక చేసే తప్పుల వల్లే అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయన్నారు.
News November 17, 2025
మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడకుండా సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. పథకం అమలులో లోటుపాట్లపై ఆరా తీశారు.


