News August 15, 2024
బాలికల కిడ్నాప్ కేసులో ఇద్దరికి రిమాండ్

గుంటూరు పట్టాభిపురం పోలీసులు కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. జూట్ మిల్లు సమీపంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో టీజేపీఎస్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఉంటున్నారు. బాలికను, ఆమె స్నేహితురాలిని తీసుకెళ్లిన కేసులో నిందితులుగా ఉన్న గోపి, మణికంఠలను పట్టాభిపురం సీఐ కిరణ్ అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు.
Similar News
News December 10, 2025
క్రిస్మస్ రద్దీకి గుంటూరు మీదగా ప్రత్యేక రైళ్లు

క్రిస్మస్ సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుంటూరు మార్గంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. చర్లపల్లి–కాకినాడటౌన్ ప్రత్యేక రైలు (07196) ఈ నెల 24, 30 తేదీల్లో రాత్రి 7.30కి బయలుదేరుతుంది. పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడటౌన్ చేరుతుంది. కాకినాడటౌన్–చర్లపల్లి (07195) ఈ నెల 28, 31 తేదీల్లో సాయంత్రం 7.50కి స్టార్ట్ అయ్యి గుంటూరు మీదుగా వెళ్తుంది.
News December 9, 2025
గుంటూరు NHM–NTEP పోస్టుల ఎంపిక జాబితా విడుదల

గుంటూరు జిల్లాలో ఎయిడ్స్, టి.బి విభాగంలో ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా DMHO విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వారు డిసెంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు అసలు సర్టిఫికెట్లతో గుంటూరు DMHO కార్యాలయంలో అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపిక జాబితా జిల్లా అధికారిక వెబ్సైట్ guntur.ap.gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు.
News December 9, 2025
గుంటూరు NHM–NTEP పోస్టుల ఎంపిక జాబితా విడుదల

గుంటూరు జిల్లాలో ఎయిడ్స్, టి.బి విభాగంలో ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా DMHO విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వారు డిసెంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు అసలు సర్టిఫికెట్లతో గుంటూరు DMHO కార్యాలయంలో అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపిక జాబితా జిల్లా అధికారిక వెబ్సైట్ guntur.ap.gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు.


