News December 10, 2024
బాలిక మృతి అత్యంత బాధాకరం: మంత్రి బీసీ

నందికొట్కూరులో ప్రేమోన్మాది దాడిలో బాలిక మృతి ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలిక మృతి అత్యంత బాధాకరమని అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో ఫోన్లో మాట్లాడి మంత్రి బీసీ.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా పట్టిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 9, 2025
క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: మంత్రి

జిల్లాలో క్రీడాభివృద్ధితో పాటు క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం టీజీవీ సంస్థలు కృషి చేస్తాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇటీవల దక్షిణ భారత స్థాయి సిలంబం పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కర్నూలులోని తన నివాసంలో ఆయన మంగళవారం ఘనంగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి మహావీర్ మాట్లాడుతూ.. దక్షిణ భారత స్థాయిలో జిల్లా క్రీడాకారులు అనేక పతకాలు సాధించారన్నారు.
News December 9, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. భారీ వాహనాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్డివిజన్లలో నేషనల్ హైవేలు 40, 44పై లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, వ్యాన్లు, లగేజీ వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించారు.
News December 9, 2025
ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం తగ్గించాలి: కర్నూలు కలెక్టర్

జిల్లాలో పీజీఆర్ఎస్ పనితీరు విశ్లేషణలో భాగంగా సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం గత నెలలో ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం బాగా తగ్గిందని, డిసెంబర్లో ఇంకా ఎక్కువగా తగ్గించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులను ఆడిట్ చేయడంలో 20 శాతం పెండింగ్ ఉందని వెంటనే ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.


