News August 7, 2024

బాల కార్మికులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలో బాల కార్మికులను గుర్తించేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.

Similar News

News November 14, 2025

అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్: గంటా

image

అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాతగోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో సమస్యలు పెరిగాయని, త్వరలో నియామకం జరగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

News November 14, 2025

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఆత్మీయ వీడ్కోలు

image

ఏయూ వేదికగా నిర్వహించిన సిఐఐ సమ్మెట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు లభించింది. శుక్రవారం ఉదయం చేరుకున్న ఆయనకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఆయన వాయుమార్గంలో ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు.

News November 14, 2025

లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించండి: DMHO

image

ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించాలని DMHO జగదీశ్వరరావు అన్నారు. తరచుగా మూత్ర విసర్జన, మానసిక స్థితిలో, కళ్ల దృష్టిలో మార్పు, బరువు తగ్గడం,బలహీనతగా ఉండటం, ఎక్కువగా దాహం కలగడం వంటి లక్షణాల ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. దగ్గరలో ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకోవాలన్నారు.