News June 3, 2024

బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు కేంద్రంలోని కలెక్టరేట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈనెల 1 నుంచి 30 వరకు జరిగే ప్రత్యేక తనిఖీల కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. బాల కార్మికులు ఎక్కడైనా పనిచేసినట్లయితే పోలీసు నంబరు 100 లేదా చైల్డ్ లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

Similar News

News October 22, 2025

ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

జరుగుమల్లి నుంచి కొందరు అక్రమంగా ఇసుకను ఒంగోలుకు తరలిస్తున్నారని ఫలితంగా ఒంగోలులో ఇసుక యార్డుల నుంచి సరఫరా చేసే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్ రాజా బాబుకు రవాణాదారులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆయా వనరుల నుంచి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఇసుకను తరలిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని
కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు.

News October 22, 2025

విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి..

image

పొదిలి మండలం సలకనూతల గ్రామం సమీపంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్ పై గ్రామానికి వెళ్తున్న తండ్రి, కొడుకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య (60), మాదాల వెంకటేశ్వర్లు (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News October 21, 2025

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలి: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన ఒంగోలు క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత,‌ రవాణా, వర్షాకాలం దృష్ట్యా ముందుగానే ప్రజలకు అవసరమైన స్థాయిలో యార్డుల్లో అందుబాటులో ఉంచడం తదితర అంశాలను గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్‌కు వివరించారు.