News February 21, 2025
బావుసాయిపేటలో మృతదేహంతో ఆందోళన

కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బత్తుల రేన (22) అనే వివాహిత బతుకుతెరువు కోసం వేములవాడ రూరల్ మండలం నాంపల్లిలో ఉంటుంది. గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గతంలో కూడా భర్త మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వీరిద్దరి మృతికి కారకుడు అంటూ బావుసాయిపేట గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఇంటి ముందు రేనా మృతదేహంతో ఆందోళన దిగారు.
Similar News
News November 23, 2025
సిద్దిపేట: మొదటి మహిళా డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి

2014లో సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత మూడు సార్లు డీసీసీ కమిటీ ఏర్పడింది. అందులో మొదటి, 2వ సారి తూంకుంట నర్సారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహారించారు. 3వసారి ఆయన కూతురైన ఆంక్షారెడ్డి నియామకమయ్యారు. ఒక ఫ్యామిలీ నుంచి మూడు సార్లు ఈ పదవి పొందడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను ఆమె ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి!
News November 23, 2025
ఏటూరునాగారం: బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం విక్రయదారులకు సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఈ ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.
News November 23, 2025
ఏటూరునాగారం: బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం విక్రయదారులకు సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఈ ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.


