News February 2, 2025

బాసరకు పోటెత్తిన భక్తులు

image

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగే వసంత పంచమి వేడుకలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సాధారణ సెలవు దినం కావడం ఉత్సవాల ప్రత్యేక దినం కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటల నుంచి ఆదివారం అక్షర శ్రీకర పూజలు ప్రారంభిస్తున్నట్లు స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ తెలిపారు. ఆలయంలో మూడు మండపాల్లో పూజలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Similar News

News February 9, 2025

ఆటోకు మూడు చక్రాలే ఎందుకు ఉంటాయంటే?

image

ఆటో రిక్షాలు ఎన్ని అప్డేట్స్ పొందినా మూడు చక్రాలతోనే వస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫోర్ వీల్ వాహనాల కన్నా 3 చక్రాల వాహనాలను బ్యాలెన్స్ చేయడం ఈజీ. ఇరుకు ప్రదేశాల్లో దీనిని నడపటానికి అనువుగా ఉంటుంది. దీనిని తయారు చేసేందుకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. ఆటోను నడిపేవారు ఆయిల్‌పై ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇది ఇంకా మూడు చక్రాలతో వస్తోంది.

News February 9, 2025

భార్యపై కోపంతో భర్త ఏం చేశాడంటే?

image

ఓ వ్యక్తి భార్యపై కోపంతో ఆమె పేరుపై ఉన్న బైక్‌పై చలానాలు వచ్చేట్లు ప్రవర్తించాడు. పట్నాకు చెందిన ఓ వ్యక్తి ముజఫర్‌పూర్‌కు చెందిన యువతి పెళ్లైన నెలన్నరకే విడిపోయారు. ఆ యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ ఆమెపై కోపంతో అత్తింటి వారు ఇచ్చిన బైక్‌ను భర్త ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ నడిపాడు. బైక్ ఆమె పేరుతో ఉండటంతో చలాన్లు ఆ యువతి ఫోన్‌కు వెళ్లేవి. చలాన్లు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించారు.

News February 9, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో రిజర్వ్డ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఈ నెల 10 తేదీ ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వివరించారు.

error: Content is protected !!