News March 24, 2025
బాసరలో ఆర్జీయూకేటీలో అంతఃప్రజ్ఞ టెక్ ఫెస్ట్

బాసర RGUKTలో అంతఃప్రజ్ఞ టెక్ ఫస్ట్-యువ ఉత్సవ్2025 నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్&స్పోర్ట్స్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని వీసీ గోవర్ధన్, ADB జిల్లా యూత్ ఆఫీసర్ సుశీల్ భడ్ ప్రారంభించారు. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం, భారతదేశ వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం పట్ల ప్రశంసలను పెంపొందించడం ఆర్జీయూకేటీ లక్ష్యమని వీసీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో భారత్ నెంబర్1గా ఉండాలన్నారు.
Similar News
News January 8, 2026
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన సీఎం రేవంత్

TG: హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. ‘ఉపాధి’కి గాంధీ పేరు తొలగింపుపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై చర్చించనున్నారు. ఇతర అంశాలూ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
News January 8, 2026
విశాఖ: ‘తార’ల క్రికెట్ సందడి.. ఆ 3 రోజులు పండగే!

విశాఖ వేదికగా తారల క్రికెట్ పండగకు రంగం సిద్ధమైంది. ACA-VDCA స్టేడియంలో జనవరి 16, 17, 18 తేదీల్లో CCL 2026 మ్యాచ్లు జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 16న మధ్యాహ్నం 2 గంటలకు పంజాబ్ vs కర్ణాటక, సాయంత్రం 6:30కు మన తెలుగు వారియర్స్ vs భోజ్పురి దబాంగ్స్ తలపడతాయి. 17, 18 తేదీల్లో ముంబై, బెంగాల్, చెన్నై జట్లు ఆడే మ్యాచ్లతో ఈ వారాంతం విశాఖలో సందడి నెలకొననుంది.
News January 8, 2026
IPAC ఆఫీసుపై ED దాడులు

కోల్కతా సాల్ట్ లేక్లోని IPAC ఆఫీసు, సంస్థ కో ఫౌండర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ED దాడులు చేస్తోంది. కోల్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కేసులో TMC జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీని ED, CBI అధికారులు పలుమార్లు విచారించారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి IPAC, TMC కలిసి పనిచేస్తున్నాయి. కొన్ని నెలల్లో WBలో ఎన్నికలు జరగనున్నందున రైడ్స్కు ప్రాధాన్యం ఏర్పడింది.


