News April 7, 2024
బాసరలో విగ్రహాలు ధ్వంసం

బాసర మండలంలోని ఓ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న చింతామణి గణపతి ఆలయంలోని నాగదేవత, నందీశ్వరుని విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు స్థానికులు తెలిపారు. ఉదయం పూట ఆలయాన్ని శుభ్రం చేసే మహిళ ఈ విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసుకలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News November 13, 2025
నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదు: ADB కలెక్టర్

విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాల కోసం అవసరమైన మీసేవ ధ్రువపత్రాలు పొందడానికి ఇకపై నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తహశీల్దార్ కార్యాలయాల్లో నోటరైజ్డ్ అఫిడవిట్ అడగడం వల్ల పేద ప్రజలకు అదనపు ధన వ్యయం, సమయ నష్టం జరుగుతున్నదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై అలాంటి అఫిడవిట్లు లేదా గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
News November 12, 2025
ఆదిలాబాద్: రేపు జోనల్ స్థాయి యోగా పోటీలు

ఇచ్చోడ మండలంలోని బోరిగామా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 14 – 17 సంవత్సరాల బాలబాలికలకు జోనల్ స్థాయి యోగా పోటీలను ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు DEO రాజేశ్వర్, SGF జిల్లా కార్యదర్శి రామేశ్వర్ పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి యోగా పోటీలు కరీంనగర్ జిల్లాలోని వెలిచల రామడుగు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉంటాయని పేర్కొన్నారు. 15, 16, 17 మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు.
News November 12, 2025
ఆదిలాబాద్: పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, తలమడుగు, తాంసి, ఉట్నూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలు తప్పనిసరి అన్నారు.


