News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
NTR: వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు

KRU పరిధిలోని కళాశాలలలో పీజీ కోర్సులలో వేకెంట్ సీట్ల భర్తీకై ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని వర్సిటీ డైరెక్టర్ డా.ఎల్. సుశీల తెలిపారు. ఏపీ పీజీసెట్-2025 రాసి క్వాలిఫై కానివారు, ఆ పరీక్ష రాయనివారు స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చని, ప్రభుత్వ నిబంధనల మేరకు వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించదన్నారు. DEC 8న ఉదయం 10 గంటలకు KRU క్యాంపస్లో సంప్రదించాలన్నారు.
News December 6, 2025
వంటింటి చిట్కాలు

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.
News December 6, 2025
GNT: మంత్రి నారా లోకేశ్పై అంబటి ట్వీట్

మంత్రి నారా లోకేశ్పై గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ‘X’లో సెటైరికల్ ట్వీట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం మంత్రి లోకేశ్ చంద్రబాబు ప్లేటును తీస్తున్న ఓ ఫొటో షేర్ చేసి, ఇప్పుడు నువ్వు “తిన్న ప్లేటు” రేపు నువ్వు “కూర్చున్న సీటు” తీసేయడం కాయం.! అంటూ క్యాప్షన్ ఇచ్చి చంద్రబాబు, లోకేశ్లకు ట్యాగ్ చేశారు.


