News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 8, 2025
సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News December 8, 2025
పెద్దపల్లి: ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్..!

పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామాలలో ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉప సర్పంచ్ ఆశావహులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులతో బేరసారాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో మద్దతు తెలపాలని ఒక్కో వార్డు సభ్యుడికి రూ.50,000 నుంచి రూ.1,00,000 ముట్టినట్లు గ్రామాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఈనెల 14న పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు.
News December 8, 2025
నర్సీపట్నంలో CMR జువెలరీ మాల్ ప్రారంభం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో CMR జువెలరీ మాల్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, CMR అధినేత మావూరి వెంకటరమణ, బాలాజీ కలిసి ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో CMR అంటేనే ఒక బ్రాండ్ అని,నమ్మకానికి మరో పేరు అని అయ్యన్న కొనియాడారు. మహానగరాలకు మాత్రమే పరిమితం కాకుండా నర్సీపట్నం లాంటి పట్టణంలో కూడా ఇటువంటి జువెలరీ స్టోర్ను ప్రారంభించినందుకు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.


