News February 14, 2025

బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

image

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 10, 2025

IVF ప్రక్రియలో దశలివే..

image

IVFలో 5 కీలకమైన దశలు ఉంటాయి. ఎగ్‌ స్టిమ్యులేషన్‌కు హార్మోన్ల ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి బ్లడ్‌ టెస్ట్‌ చేయడానికి 9-14 రోజులు పడుతుంది. తర్వాత పిండాన్ని బదిలీ చేస్తారు. యావరేజ్‌గా IVF సైకిల్‌ కోసం 17-20 రోజుల సమయం పడుతుంది. అయితే పేషెంట్‌ కండీషన్‌ బట్టి.. సమయం మారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా సంతానం పొందాలనుకునేవారు ప్రోటీన్లు, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.

News November 10, 2025

గద్వాల్ జిల్లాలో 11-14°C డీగ్రీల ఉష్ట్రోగతలు

image

తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 11 నుంచి 19 వరకు జోగుళాంబ గద్వాల్ జిల్లాలో 11-14°C డీగ్రీల ఉష్ట్రోగతలు నమోదై అవుతాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణం కంటే ఈసారి చలి తీవ్రత ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. చిన్నారులు వృద్ధులు రైతులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అసాధారణంగా ఈసారి చలి తీవ్రత ఎక్కువ రోజులు ఉండనుంది.

News November 10, 2025

చక్కెర తినడం మానేస్తే..

image

చక్కెర తినడం మానేస్తే శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన నిద్ర ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఆకలి తగ్గుతుంది. సాధారణంగా బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె, కాలేయం మరింత ఆరోగ్యవంతంగా మారుతాయి. చిరాకు, ఆందోళన తగ్గి ఫోకస్ పెరుగుతుంది. అయితే ఒక్కసారిగా మానేయకుండా క్రమంగా తగ్గించాలి’ అని సూచిస్తున్నారు.