News February 14, 2025

బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

image

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

జపమాలలో 108 పూసలు ఎందుకు?

image

జపమాలలో ఓ గురు పూసతో పాటు 108 ప్రార్థన పూసలు ఉంటాయి. అందులో 108 పూసలు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలను సూచిస్తాయి. భక్తులు ఆ మొత్తం పూసలను లెక్కించడాన్ని ఓ వృత్తం పూర్తైనట్లుగా భావిస్తారు. అలాగే ఇవి పుట్టుక, జీవితం, మరణం.. అనే మన జీవిత చక్రాన్ని చిత్రీకరిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా జపమాల సాధన చేసిన వారికి ఆధ్యాత్మిక పురోగతి ఉంటుందని, త్వరగా మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

News December 16, 2025

నల్గొండ: పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు

image

ఇటీవల జరిగిన మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పొత్తులతో కమ్యూనిస్టు పార్టీలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. సీపీఎం 48, సీపీఐ 63, సీపీఐ(ఎంఎల్) మాస్ 10 స్థానాలు గెలుచుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం జిల్లాల్లో వీరి ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పొత్తులు కలిసి వచ్చాయి.

News December 16, 2025

సిడ్నీ దాడి నిందితుడిది హైదరాబాదే: TG DGP

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో <<18568131>>కాల్పులు<<>> జరిపిన నిందితుడు సాజిద్ అక్రమ్‌ హైదరాబాద్‌కు చెందిన వాడేనని తెలంగాణ డీజీపీ ఆఫీసు తెలిపింది. ‘సాజిద్ 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. యూరోపియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి నవీద్‌తోపాటు ఓ కుమార్తె కూడా ఉంది. భారత్‌కు 6 సార్లు వచ్చాడు’ అని ఓ ప్రకటనలో వెల్లడించింది. అతడు ఇప్పటిదాకా భారత పాస్‌పోర్టునే వినియోగించినట్లు పేర్కొంది.