News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 16, 2025
నల్గొండ: అభ్యర్థి చనిపోవడంతో ఓట్ల డబ్బును తిరిగిచ్చిన గ్రామస్థులు

మునుగోడు మండలం కిష్టాపురంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. చెనగోని కాటంరాజు బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేసి ఓటమి తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన అంత్యక్రియల సందర్భంగా అతను ఓట్ల కోసం పంచిన డబ్బులను ఎస్సీ కాలనీ ఓటర్లు తిరిగి తన కొడుకు వంశీకి అందజేశారు. 11న జరిగిన ఎన్నికల్లో కాటంరాజు 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నగదును తిరిగి ఇవ్వడం పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు.
News December 16, 2025
విజయనగరం: దేశంలో తొలి AAD ఎడ్యుకేషన్ సిటీ.!

విజయనగరం జిల్లా భోగాపురంలో దేశంలోనే తోలి ఏవియేషన్ ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఏడ్యుకేషన్ సిటీని విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో నేడు లాంఛనంగా మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. జీఎంఆర్-మాన్సాస్ ఆధ్యర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సమీపంలో 160 ఎకరాల స్థలంలో స్థాపించనున్నారు. ఈకార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొనున్నారు. ఇప్పటికే లోకేశ్ విశాఖకు చేరుకున్నారు.
News December 16, 2025
బేబీ వెయిట్ పెరగడానికి ఏం చేయాలంటే?

గర్భంలో పిండం బరువు ఎందుకు పెరగట్లేదో ముందుగా తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బేబీ ఊపిరితిత్తులు సరిగా లేకపోతే ఇంజక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్లు సూచించిన స్కాన్లు ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వేరుశెనగలు, రాజ్మా, మిల్క్, ఎగ్స్, మాంసం, పప్పులు, పనీర్ వంటి ప్రొటీన్ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.


