News February 8, 2025
బాసర ట్రిపుల్ ఐటీలో తప్పులపై అధ్యాయన కమిటీ

బాసర ట్రిపుల్ ఐటీ పరీక్షా పత్రాల మూల్యంకనం ప్రక్రియపై నిజ నిర్ధారణ కమిటీ నియమించినట్లు యూనివర్సిటీ పరిపాలన అధికారి రణధీర్ తెలిపారు. మూల్యంకనంలో పొరపాట్లతో పరీక్షలు బాగా రాసినా ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎగ్జామినేషన్ సెక్షన్ అధికారిని విద్యార్థులు నిలదీసి నిరసన తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు కమిటీ వేసినట్లు అధికారులు వివరించారు.
Similar News
News December 5, 2025
KNR: TALLY.. రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని TASK ఆఫీస్లో TALLY ERP 9 విత్ GSTలో శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ల గడువును DEC 12 వరకు పొడిగించినట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు కరీంనగర్ IT టవర్ మొదటి అంతస్తులోని TASK కార్యాలయంలో సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. TALLY నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఇది సువర్ణవకాశమని అన్నారు. అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 5, 2025
మీరు ఇలాగే అనుకుంటున్నారా?

మనం అనేక వ్రతాలను ఆచరిస్తాం. ఏదో ఒక రోజున మన కోరిక నెరవేరినప్పుడు, అది చివరి సారి చేసిన వ్రత ఫలితమే అనుకుంటాము. ఆ ఒక్క వ్రతాన్నే గొప్పదని భావిస్తాము. అంతకుముందు చేసిన వ్రతాల శక్తిని తక్కువగా అంచనా వేస్తాము. కానీ, ఈ విజయం అన్ని వ్రతాల సంచిత ఫలితమని గ్రహించాలి. ఒక దుంగ నూరవ దెబ్బకు పగిలితే, అందుకు మొదటి 99 దెబ్బలు ఎలా కారణమవుతాయో మనం చేసిన చిన్న చిన్న వ్రతాల ఫలితాలు కూడా అంతే. ఏ వ్రతం చిన్నది కాదు.
News December 5, 2025
కృష్ణా: మెగా PTM-3.0 కార్యక్రమానికి సర్వం సిద్ధం

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 2500లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మెగా PTM-3.0 నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రగతిని తెలుసుకోనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారీ భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ గాంధీ హైస్కూల్కు దాతలు ఉచితంగా 6 లాప్టాప్లను అందించారు. జిల్లాలో ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


