News February 8, 2025
బాసర ట్రిపుల్ ఐటీలో తప్పులపై అధ్యాయన కమిటీ

బాసర ట్రిపుల్ ఐటీ పరీక్షా పత్రాల మూల్యంకనం ప్రక్రియపై నిజ నిర్ధారణ కమిటీ నియమించినట్లు యూనివర్సిటీ పరిపాలన అధికారి రణధీర్ తెలిపారు. మూల్యంకనంలో పొరపాట్లతో పరీక్షలు బాగా రాసినా ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎగ్జామినేషన్ సెక్షన్ అధికారిని విద్యార్థులు నిలదీసి నిరసన తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు కమిటీ వేసినట్లు అధికారులు వివరించారు.
Similar News
News December 4, 2025
MHBD జిల్లాలో 9 గ్రామాలు ఏకగ్రీవం

MHBD జిల్లాలో 9మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లికుదురు(M) పార్వతమ్మగూడెం నుంచి పూలమ్మ, కేసముద్రం(M) చంద్రుతండా నుంచి శ్రీను, క్యాంపుతండా నుంచి కైక, నారాయణపురం నుంచి యమున ఏకగ్రీవమయ్యారు. ఇనుగుర్తి(M) పాతతండా నుంచి నరేష్, రాముతండా నుంచి మీటునాయక్, MHBD(M) సికింద్రాబాద్ తండా నుంచి నూనావత్ ఇస్తారి, రెడ్యాల నుంచి లక్ష్మి, గూడూరు(M) రాజన్పల్లి నుంచి మంగ సర్పంచ్లుగా ఎన్నికయ్యారు.
News December 4, 2025
దేశ సేవలో అన్నదమ్ములు..

నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు అగ్నివీరులుగా ఎంపికయ్యారు. మహబూబ్ బాషా కుమారులు అబ్దుల్ నబీ, మహమ్మద్ ఇర్ఫాన్ అగ్నివీర్ నియామకాల్లో ప్రతిభ చూపారు. బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మహమ్మద్ ఇర్ఫాన్ రాజస్థాన్లో, అబ్దుల్ నబీ హిమాచల్ప్రదేశ్లో విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. దేశ సేవకు అంకితమైన వారిని స్థానికులు అభినందించారు.
News December 4, 2025
పవన్ కళ్యాణ్కు మంత్రి ఆనం సూచన ఇదే..!

ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్లు కట్టించండి’ అని ఆనం కోరగా ఆలోచన చేస్తామని పవన్ చెప్పారు.


