News February 8, 2025

బాసర ట్రిపుల్ ఐటీలో తప్పులపై అధ్యాయన కమిటీ

image

బాసర ట్రిపుల్ ఐటీ పరీక్షా పత్రాల మూల్యంకనం ప్రక్రియపై నిజ నిర్ధారణ కమిటీ నియమించినట్లు యూనివర్సిటీ పరిపాలన అధికారి రణధీర్ తెలిపారు. మూల్యంకనంలో పొరపాట్లతో పరీక్షలు బాగా రాసినా ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎగ్జామినేషన్ సెక్షన్ అధికారిని విద్యార్థులు నిలదీసి నిరసన తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు కమిటీ వేసినట్లు అధికారులు వివరించారు.

Similar News

News March 19, 2025

సునీత గురించి ఈ విషయాలు తెలుసా?

image

సునీతా విలియమ్స్ 1987లో అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టమ్ కమాండర్, డైవింగ్ ఆఫీసర్‌, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్‌గా పని చేశారు. మధ్యదరా, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రంలో డ్యూటీ చేశారు. ఎన్నో భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవాన్ని గడించారు. 1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో ISSకు వెళ్లారు. 2007లో స్పేస్‌లో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

News March 19, 2025

సునీత విషయంలో రాజకీయం!

image

సునీత, విల్మోర్ 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా బోయింగ్ స్టార్ లైనర్‌లో సమస్యలతో అక్కడే ఉండిపోయారు. అప్పటికే బోయింగ్ కంపెనీకి చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ప్రతిష్ఠాత్మకమైన ఇలాంటి యాత్రలకు బైడెన్ సర్కార్ ఆ కంపెనీనే సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఎలాన్ మస్క్ ట్రంప్ అధికారంలోకి రాకముందు వారిని తీసుకొస్తే బైడెన్‌కు మైలేజీ పెరుగుతుందని ఆలస్యం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News March 19, 2025

పుంగనూరులో 32 మంది కానిస్టేబుళ్ల బదిలీ

image

పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో కానిస్టేబుళ్లను భారీగా బదిలీ చేశారు. ఏకంగా 32 మందిని బదిలీ చేస్తూ చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఇద్దరినీ వీఆర్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన సిబ్బందిని వెంటనే రిలీవ్ చేయాలని.. కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో రిపోర్ట్ చేయాలని ఎస్పీ ఆదేశించారు.

error: Content is protected !!