News March 21, 2025
బాసర: మానవత్వం చాటుకున్న పోలీసులు

బాసర పోలీసులు మానవత్వం చాటుకున్నారు. బాసరలోని శారద నగర్ విద్యుత్ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై ఓ అనాథ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ పడిపోయింది. వెళుతున్న పోలీసులు గమనించి వెంటనే ఆమెను 108లో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె కొంతకాలంగా పలు కాలనీల్లో ప్లాస్టిక్ వస్తువులను పోగు చేసి వచ్చిన డబ్బులతో జీవిస్తోందన్నారు.
Similar News
News December 22, 2025
TPT: పరిశ్రమ ప్రతినిధులకు మంచి అవకాశం

తిరుపతి జిల్లాలోని పరిశ్రమల ప్రతినిధులకు మంగళవారం నుంచి రెండు రోజులు ఉచిత వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (VDP) నిర్వహించనున్నారు. తిరుచానూరు సమీపంలోని లెమన్ ట్రీ ప్రీమియర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి ఉన్న MSME యాజమాన్యాలు https://forms.gle/xYYUuZbrFAntCUj5A వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.
News December 22, 2025
జనగామ: అంబులెన్స్లో వచ్చి సర్పంచ్గా ప్రమాణ స్వీకారం

జనగామ మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్ అంబులెన్స్లో వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారిణిగా ఏఈవో సౌమ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సర్పంచ్ గొల్లపల్లి అలేఖ్య అనారోగ్యంతో ఉండగా అంబులెన్స్లో వచ్చి మరీ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్గా గొల్లపల్లి పర్షయ్య ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
News December 22, 2025
పదేళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు: జూపల్లి

TG: పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని <<18633566>>KCR<<>>ను మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ‘BRS పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. వారి హయాంలో ప్రధాన కాలువలు పూర్తి చేయలేదు. పాలమూరు-RRని తాగునీటి ప్రాజెక్టు అని సుప్రీంకోర్టులో కేసు వేసిన KCR ఇప్పుడేమో సాగునీటి ప్రాజెక్టు అంటున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.40-50 వేల కోట్లు కావాలి’ అని చెప్పారు.


