News March 21, 2025

బాసర: మానవత్వం చాటుకున్న పోలీసులు

image

బాసర పోలీసులు మానవత్వం చాటుకున్నారు. బాసరలోని శారద నగర్‌ విద్యుత్ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై ఓ అనాథ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ పడిపోయింది. వెళుతున్న పోలీసులు గమనించి వెంటనే ఆమెను 108లో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె కొంతకాలంగా పలు కాలనీల్లో ప్లాస్టిక్ వస్తువులను పోగు చేసి వచ్చిన డబ్బులతో జీవిస్తోందన్నారు.

Similar News

News November 28, 2025

HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

image

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.

News November 28, 2025

HYD: మెగా కార్పోరేషన్‌గా జీహెచ్ఎంసీ

image

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో GHMC మెగా కార్పోరేషన్‌గా అవతరించింది. కాగా కార్పోరేషన్‌ను 2 లేదా 3గా విభజించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. సంస్థాగత పునర్విభజన, కార్పొరేషన్ బట్టి ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందని టాక్.

News November 28, 2025

గొలుగొండ: షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టిన భర్త.. భార్య సూసైడ్

image

మండలంలోని కొంగసింగిలో వివాహిత అరిటా లక్ష్మీపార్వతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. మృతురాలి భర్త ప్రసాద్ నేవీ ఉద్యోగిగా పని చేసి రిటైరయ్యాడు. అనంతరం వచ్చిన రూ.20 లక్షలు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మొత్తం డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరి మధ్యగొడవ జరింది. అనంతరం తన గదిలోకి వెళ్లిన లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది.