News January 21, 2025
బిక్కనూరు: పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. మంగళవారం బిక్కనూరు మండలం భగీరథ పల్లి గ్రామంలో జరిగిన ప్రజా పాలన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఆత్మీయ భరోసా పథకాలను అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రజిత, తహశీల్దార్ శివప్రసాద్ ఉన్నారు.
Similar News
News February 9, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 9, 2025
CCL: తెలుగు వారియర్స్ ఓటమి

సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో కర్ణాటక బుల్డోజర్స్తో మ్యాచులో తెలుగు వారియర్స్ 46 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 113/3 స్కోర్ చేయగా, తెలుగు టీమ్ 99/5 చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బుల్డోజర్స్ 123/3 స్కోర్ సాధించగా, వారియర్స్ 91/9కే పరిమితమై పరాజయం పాలైంది. KA జట్టులో డార్లింగ్ కృష్ణ 38 బంతుల్లోనే 80 రన్స్ చేసి రాణించారు.
News February 9, 2025
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్: డిపో మేనేజర్

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ నడుపుతున్నట్లు RTC WGL-1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు. ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బయలు దేరుతుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.4500, పిల్లలకు రూ.3వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 9959226047, 9494107944 నెంబర్లో సంప్రదించాన్నారు.