News February 10, 2025
బిక్కనూర్లో టీ బ్రేక్ తీసుకున్న త్రిపుర గవర్నర్

బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ పరిధిలోని ఓ హోటల్ వద్ద సోమవారం త్రిపుర గవర్నర్ నల్ల ఇంద్రసేనారెడ్డి ఆగారు. హైదరాబాద్ నుంచి బాసర వెళ్తుండగా హోటల్ వద్ద కొద్దిసేపు ఆగి టీ తాగారు. హోటల్ యజమాని రవీందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Similar News
News November 4, 2025
APPLY NOW: NRDCలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(<
News November 4, 2025
ఉప్పలగుప్తం: నాచుతో డబ్బులే డబ్బులు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలను సముద్రపు నాచు పెంపకానికి ఎంపిక చేసినట్లు అమృతానంద విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమృత నటరాజన్ తెలిపారు. నాచును ఆహారంగా తీసుకుంటున్న జపాన్ దేశస్థుల ఆయుష్షు పెరిగినట్టు సర్వేలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఉప్పలగుప్తం(M) వాసాలతిప్పలో సోమవారం మత్స్యకారులకు నాచు పెంపకంపై అవగాహన కల్పించారు. ఎరువులు వాడకుండానే 45 రోజులకు నాచు ఉత్పత్తి వస్తుందని వివరించారు.
News November 4, 2025
రేపు కడపకు రానున్న AR రెహమాన్

ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించే గంధం వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన వస్తుంటారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం వేడుకలకు పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.


