News March 12, 2025
బిక్కనూర్: కంటి అద్దాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

దృష్టి లోపం ఉన్న వారు కంటి అద్దాలు వాడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దృష్టి లోపం ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివప్రసాద్, కంటి వైద్యాధికారి రవీందర్ ఉన్నారు.
Similar News
News December 16, 2025
HYD: భగత్సింగ్ వీలునామా.. విప్లవానికి అక్షరనామా

‘భగత్సింగ్ వీలునామా’ నవల స్వాతంత్ర్య సమరయోధుడి ఆలోచనా, త్యాగస్ఫూర్తిని గుండెను తాకేలా ఆవిష్కరిస్తుంది. విప్లవం ఆయుధాలతోనే కాదు, ఆలోచనలతోనూ సాగుతుందన్న సత్యాన్ని బలంగా చాటిందీ పుస్తకం. భగత్సింగ్ ఆశయాలు, సమాజ మార్పుపై ఆయన కలలు ప్రతి పుటలో ప్రతిధ్వనిస్తాయి. యువతను ఆలోచింపజేసే ఈ రచన, దేశభక్తికి కొత్త నిర్వచనం చెబుతుంది. పాఠకుడిని లోతైన ఆలోచనలోకి నెట్టే బాధ్యతాయుత రచన. అందరూ చదవాల్సిన నవల ఇది.
News December 16, 2025
HYD: భగత్సింగ్ వీలునామా.. విప్లవానికి అక్షరనామా

‘భగత్సింగ్ వీలునామా’ నవల స్వాతంత్ర్య సమరయోధుడి ఆలోచనా, త్యాగస్ఫూర్తిని గుండెను తాకేలా ఆవిష్కరిస్తుంది. విప్లవం ఆయుధాలతోనే కాదు, ఆలోచనలతోనూ సాగుతుందన్న సత్యాన్ని బలంగా చాటిందీ పుస్తకం. భగత్సింగ్ ఆశయాలు, సమాజ మార్పుపై ఆయన కలలు ప్రతి పుటలో ప్రతిధ్వనిస్తాయి. యువతను ఆలోచింపజేసే ఈ రచన, దేశభక్తికి కొత్త నిర్వచనం చెబుతుంది. పాఠకుడిని లోతైన ఆలోచనలోకి నెట్టే బాధ్యతాయుత రచన. అందరూ చదవాల్సిన నవల ఇది.
News December 16, 2025
నేడు, రేపు స్కూళ్లకు సెలవు

TG: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన స్కూళ్లలో ఇవాళ, రేపు సెలవు ఉండనుంది. ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నారు. కాగా మూడో(తుది) విడతలో 4,158 సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు 394 సర్పంచ్, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.


