News March 12, 2025

బిక్కనూర్: కంటి అద్దాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

దృష్టి లోపం ఉన్న వారు కంటి అద్దాలు వాడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దృష్టి లోపం ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివప్రసాద్, కంటి వైద్యాధికారి రవీందర్ ఉన్నారు.

Similar News

News March 24, 2025

ఆవు పాలు తాగడంతో మహిళకు రేబిస్.. మృతి

image

ఆవు పాలు తాగిన మహిళకు రేబిస్ సోకి మృతి చెందిన ఘటన UP నోయిడాలో జరిగింది. దీనిపై ప్రముఖ వైద్యుడు సుధీర్ అవగాహన కల్పించారు. ‘నోయిడాలో వీధి కుక్క కరవడంతో ఆవుకు రేబిస్ సోకింది. దాని పచ్చి పాలు తాగడంతో మహిళ కూడా ఆ వ్యాధి బారిన పడింది. ఇలాంటి కేసు ఇదే తొలిసారి. రేబిస్ సోకిన ఆవు పచ్చి పాలు తాగితే టీకా వేసుకోవాలి. పచ్చి పాలు ఎప్పుడూ తీసుకోవద్దు. మరగబెట్టాక తాగడమే సురక్షితం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News March 24, 2025

చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది: పవన్

image

APలో తమిళ మీడియం పాఠశాలలు ఉండటం సంతోషమని BJP నేత తమిళి సై చేసిన ట్వీట్‌కు DyCM పవన్ స్పందించారు. ‘చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసింది. AP భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తోంది. తమిళంతో సహా వివిధ మాధ్యమాల్లో 1,610 పాఠశాలలను నిర్వహిస్తోంది. ఇతర భాషలను గౌరవిస్తూనే మన మాతృభాషను కాపాడుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News March 24, 2025

రాహుల్ గాంధీతో డేట్ చేయాలనుకున్నా: బాలీవుడ్ నటి

image

బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పడం కాంట్రవర్సీకి దారి తీయొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. తరచుగా RG ఫొటోలను చూసేదాన్నని పేర్కొన్నారు. తమ కుటుంబాల బ్యాగ్రౌండ్ అందరికీ తెలిసిందేనని చెప్పారు. కాగా 2012లో సైఫ్‌ను కరీనా పెళ్లి చేసుకున్నారు.

error: Content is protected !!