News February 9, 2025
బిక్కనూర్: గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసే రిమాండ్కు తరలించినట్లు బిక్కనూర్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రంతో పాటు జంగంపల్లి రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయించడంతో పాటు దానిని సేవిస్తూ పలువురు యువకులను బానిస చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో వారిని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
Similar News
News November 27, 2025
తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్పై సీఎం రేవంత్ సమీక్ష

TG: తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్పై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకోవాలి. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి’ అని తెలిపారు.
News November 27, 2025
గుంతకల్లు: రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన రాజేశ్

గుంతకల్లు పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి రాజేశ్ వినుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలలో పాల్గొని 200, 400, 4×1000 పోటీలలో ప్రథమ స్థానం సాధించి లక్నోలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్ జాతీయ పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చారని అభినందించారు.
News November 27, 2025
ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వహించాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 22 ఫ్లయింగ్ స్క్వాడ్, 6 స్టాటిక్ సర్వేలయన్స్, 6 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను, 4 అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.


