News February 9, 2025

బిక్కనూర్: గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్

image

గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసే రిమాండ్‌కు తరలించినట్లు బిక్కనూర్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రంతో పాటు జంగంపల్లి రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయించడంతో పాటు దానిని సేవిస్తూ పలువురు యువకులను బానిస చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో వారిని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.

Similar News

News July 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 6, 2025

NZB: VRకు ఏడుగురు SI

image

బాసర జోన్ పరిధిలో 14 మంది ఎస్ఐలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏడుగురిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ SHO రాము, మోపాల్ SHO యాదగిరి, ఎడపల్లి SHO వంశీ కృష్ణ, మెండోరా SHO యాసిర్ అరాఫత్, ఏర్గట్ల SHO రామును నిజామాబాద్ VRకు పంపించారు. బాల్కొండ SHO నరేశ్, మోర్తాడ్ SHO విక్రమ్‌ను ఆదిలాబాద్ VRకు అటాచ్ చేశారు.

News July 6, 2025

జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రంలోని జడ్జీలందరికీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘SM పోస్టుల కేసుల్లో ఆర్నేష్‌ కుమార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ కేసు తీర్పులో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడంలేదు. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ(3-ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో)పై FIRలు నమోదుకు ముందు కచ్చితంగా విచారణ జరగాలి. 14 రోజుల్లోగా విచారణ చేయాలి, అందుకు DSP అనుమతి పొందాలి’ అని స్పష్టం చేసింది.