News March 11, 2025

బిక్కనూర్: ‘గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు వేగవంతం చేయాలి’

image

బిక్కనూర్ మండలంలోని అన్ని గ్రామాలలో దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటును వేగవంతం చేయాలని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల పోలీస్ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్ఐలు ఆంజనేయులు, పుష్పరాజ్, స్రవంతి, ప్రభాకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 16, 2025

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో దొరిపోయారు!

image

సైబరాబాద్ CP అవినాష్ మహంతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు వీకెండ్‌లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 468 కేసులు నమోదు చేశారు. 335 బైక్‌లు, 25 త్రీ వీలర్స్, 107 ఫోర్ వీలర్స్, ఒక హెవీ వెహికల్‌పైన కేసు నమోదు చేశామన్నారు. 51-100 BAC కౌంట్‌లో అత్యధికంగా 197 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పోలీసులు వెల్లడించారు.

News November 16, 2025

నంద్యాల: మొక్కజొన్న రైతు కుదేలు

image

నంద్యాల జిల్లాలో మొక్కజొన్నకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా ఎకరాకు రూ.25వేలు పెట్టుబడి పెట్టామన్నారు. ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి ఎకరాకు 20 క్వింటాలే వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా రూ.1800లకు కొనుగోలు చేసేందుకు ఎవరూ రావటం లేదంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

News November 16, 2025

ఖమ్మం: అంకుర ఆసుపత్రి ఆధ్వర్యంలో 5కే రన్

image

గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అంకుర ఆసుపత్రి ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సౌజన్యంతో ఆదివారం 5కే రన్ నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డా.చల్లగుళ్ల రాకేశ్, డా.టి.శ్రీనిధి పర్యవేక్షణలో లకారం ట్యాంక్ బండ్‌ నుంచి ఆసుపత్రి వరకు ఈ రన్ కొనసాగింది. ఈ సందర్భంగా గర్భిణుల సంరక్షణ, నవజాత శిశువుల ఆలనా పాలనా గురించి వారు వివరించారు. ప్రముఖ టీవీ యాంకర్ రవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.