News April 9, 2025

బిక్కనూర్: పరీక్ష ఫీజులకు ఈనెల 15 తుది గడువు

image

టీయూలో 5సం.ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన అప్లైడ్ ఎకనామిక్స్, ఎంబీఏ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ 6,8,10 సెమిస్టర్‌ల పరీక్షలకు వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్ష ఫీజుకు ఈ నెల 15లోగా చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సీవోఈ డా. సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ https://tuadmissions.org/examhome/eb/view/notif.php సందర్శించాలన్నారు.

Similar News

News December 5, 2025

HYD: ‘మెట్రో’ భూములు ఏమయ్యాయి?

image

మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా అప్పటి ప్రభుత్వం మెట్రోకు 57 ఎకరాలను కేటాయించింది. మెట్రో అధికారులు మాత్రం కేవలం 18 ఎకరాలను మాత్రమే వినియోగించారు. మూసారంబాగ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మాదాపూర్‌లో మాత్రమే మాల్స్ కట్టి మిగతా 39 ఎకరాలను వదిలేసింది. ఇపుడు ఈ స్థలాలను ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వాటిని వాడుకోలేదని తెలుసుకునే పనిలో పడ్డారు.

News December 5, 2025

విమానాల రద్దు.. ఈ విషయాలు తెలుసుకోండి!

image

3 రోజులుగా ఇండిగో విమాన <<18473431>>సర్వీసులు<<>> రద్దవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయాల్లో ఎయిర్‌లైన్స్ పాటించాల్సిన బాధ్యతలపై DGCA రూల్స్ జారీ చేసింది. ఆ ప్రకారం.. సర్వీసు రద్దయితే ముందే సమాచారం ఇవ్వాలి. ప్రత్యామ్నాయ విమానంలో ఫ్రీగా వెళ్లే ఏర్పాటు చేయాలి. ప్రయాణికులు కోరుకుంటే రీఫండ్ చేయాలి. 2గంటలకు మించి ఆలస్యమైతే భోజనం, ఫ్రెష్ అయ్యే సౌకర్యం కల్పించాలి. 24 గంటలు దాటితే ఫ్రీగా హోటల్, రవాణా ఏర్పాటు చేయాలి.

News December 5, 2025

కోదాడ: భర్త వార్డు సభ్యుడిగా.. భార్య సర్పంచ్‌గా పోటీ..!

image

కోదాడ పరిధి అనంతగిరి మండలం అమినాబాద్‌లో భార్యాభర్తలు ఇద్దరూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భర్త చిలకమూడి శ్రీనివాసరావు వార్డు సభ్యుడిగా పోటీలో ఉండగా సర్పంచ్ స్థానం మహిళకు రిజర్వ్డ్ కావడంతో ఆయన భార్య సంధ్యారాణిని బరిలో నిలిపారు. కాగా వారికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోంది. శ్రీనివాసరావు గతంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. దంపతులు ఇరువురు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.