News March 26, 2025

బిక్కనూర్: పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన అమ్మాయి

image

తండ్రి మృతి చెందినా దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థినిని చూసి పలువురు కంటతడి పెట్టారు. బిక్కనూర్‌కు చెందిన సత్యం అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుమార్తె కీర్తన పుట్టెడు దుఃఖంలో పదో తరగతి పరీక్ష రాసింది. కన్న తండ్రి చనిపోయినా బాధను దిగమింగి పరీక్షలు రాసిన విద్యార్థినిని తోటి విద్యార్థులు ఓదార్చారు. అంతటి బాధలో పరీక్ష రాసిన అమ్మాయి గ్రేట్ కదా.

Similar News

News November 16, 2025

చూద్దాం పదండి.. హైదరాబాద్ అందాలు

image

భాగ్యనగరం అంటే చార్మినార్‌, గోల్కొండ మాత్రమే కాదు. చరిత్ర సుగంధం వెదజల్లే అనేక అపూర్వ కట్టడాలకు ఆవాసమిది. సంస్కృతి, కళ, నిర్మాణ కౌశలాల సమ్మేళనం. శతాబ్దాల నాటి వారసత్వ సంపద నగరంలో ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వాటి వెనుక కథలను వెలికితీసే ప్రయత్నమే ఇది. రోజూ ఓ చారిత్రక కట్టడం, ప్రముఖుల విశేషాలతో ‘హైదరాబాద్‌ అందాలు’ రానుంది. వారాంతాల్లో ఈ అందాలపై ఓ లుక్ వేయండి. <<18301143>>ఫలక్‌నుమా<<>>ప్యాలెస్ గురించి తెలుసుకుందాం.

News November 16, 2025

కామారెడ్డి: చికెన్, మటన్ ధరలు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800, ఉండగా చికెన్ స్కిన్ రూ.210 -220, స్కిన్ లెస్ రూ.230-240, లైవ్ కోడి రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారం ధరలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కార్తీక మాసం కావడంతో విక్రయాలు సాధారణంగా ఉన్నాయని దుకాణాలు తెలిపారు.

News November 16, 2025

గద్వాల్ స్టేషన్‌లో ఆగే రైళ్లు ఇవే..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. గద్వాల రైల్వే స్టేషన్‌లో 17022 వాస్కో- హైదరాబాద్ 12976 మైసూర్- జైపూర్ రైళ్లను నిలిపే ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో గద్వాల్ నియోజకవర్గ ప్రజలు ఎంపీ అరుణమ్మకు ధన్యవాదాలు తెలిపారు. # SHARE IT