News March 26, 2025
బిక్కనూర్: పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన అమ్మాయి

తండ్రి మృతి చెందినా దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థినిని చూసి పలువురు కంటతడి పెట్టారు. బిక్కనూర్కు చెందిన సత్యం అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుమార్తె కీర్తన పుట్టెడు దుఃఖంలో పదో తరగతి పరీక్ష రాసింది. కన్న తండ్రి చనిపోయినా బాధను దిగమింగి పరీక్షలు రాసిన విద్యార్థినిని తోటి విద్యార్థులు ఓదార్చారు. అంతటి బాధలో పరీక్ష రాసిన అమ్మాయి గ్రేట్ కదా.
Similar News
News November 27, 2025
ప్రకాశం: ఫ్రీ ట్రైనింగ్తో జాబ్.. డోంట్ మిస్.!

ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ బాలికల కళాశాలలో ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 3 నెలలు ఉచిత శిక్షణ అందిస్తామని, ఆ తర్వాత ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 28లోగా కళాశాలను సంప్రదించాలన్నారు.
News November 27, 2025
ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
News November 27, 2025
ASF: గ్రామ పంచాయతీ ఎన్నికలకు హెల్ప్లైన్ ఏర్పాటు

ఆసిఫాబాద్ కలెక్టరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమాచారం, సందేహాల పరిష్కారం కోసం కలెక్టరేట్ పరిధిలో టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు (గురువారం)సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. ఓటింగ్, నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియపై ప్రజలు ఈ నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని అధికారులు పేర్కొన్నారు.


