News March 29, 2025
బిక్కనూర్: బీడీ కార్మిక సంఘం అధ్యక్షుడి ఎన్నిక

రాష్ట్ర బీడీ కార్మిక సంఘం అధ్యక్షునిగా సందుగారి రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. బిక్కనూర్ మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన ఆయన బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత 22 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర బీడీ కార్మిక సంఘం అధ్యక్షునిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News January 8, 2026
ప్రభుత్వ ప్రకటనల్లో నాయకుల ఫొటోలు.. జోక్యానికి హైకోర్టు నిరాకరణ

AP: ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, అధికార పార్టీ నాయకుల ఫొటోలను ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినవారిని శిక్షించే పరిధి హైకోర్టుకు లేదని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకే వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. కాగా విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి కొండలరావు ఈ పిల్ను దాఖలు చేశారు.
News January 8, 2026
మీ సమస్యలను సీఎంకు చెబుతా: గొట్టిపాటి

ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
News January 8, 2026
పల్నాడు జిల్లాకు మణిహారంగా అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా నవ నగరాలు నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాకు అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మించనుంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో భూ సమీకరణ ప్రారంభం సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయం వెల్లడించారు. 7,465 ఎకరాల పట్టా భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పల్నాడు జిల్లాకు స్పోర్ట్స్ సిటీ మణిహారం కానుంది.


