News March 21, 2025
బిచ్కుంద: 2024లో హత్య.. నేడు అరెస్టు

హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బిచ్కుంద సీఐ నరేశ్ తెలిపారు. శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్లో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. బిహార్ చెందిన అంటుకుమార్ హస్గుల్లో మనీష్కు మద్యం తాగించి హత్య చేసి పరారయ్యాడు. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో 2024లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
అయిజ: ‘చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి’

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బాస్కెట్బాల్ అసోసియేషన్ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, SI తరుణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయిజ మండలం ఉత్తనూర్ ZPHS ప్రాంగణంలో మంగళవారం SGF జిల్లాస్థాయి అండర్-14, అండర్-17 బాస్కెట్బాల్ క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయి పోటీలకు ఎంపికచేశారు.
News November 11, 2025
రాంబిల్లి: 106 ఎకరాల్లో రూ.1175 కోట్లతో పరిశ్రమ

బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలో రూ.1175 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎన్.కె అగర్వాల్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ రాంబిల్లి మండలంలో కృష్ణంపాలెంలో మంగళవారం ఆయన పర్యటించారు. వచ్చే సంవత్సరంలో దీపావళి నాటికి రూ.605 కోట్లతో ఫేజ్-1 పూర్తి కానుంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
News November 11, 2025
ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదా?

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదని, భయాందోళనలో తొందరపడి చేసిన దాడిగా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ANI పేర్కొంది. ‘టెర్రర్ నెట్వర్క్స్పై దాడుల నేపథ్యంలో ఆ ఒత్తిడిలో ఇలా చేసి ఉండొచ్చు. నిందితుడు రెగ్యులర్ సూసైడ్ బాంబింగ్ పాటర్న్ ఫాలో కాలేదు. ఇంటెన్షనల్గా దేనిని ఢీకొనలేదు. పూర్తిగా డెవలప్ కాని బాంబును వాడటంతో తీవ్రత తగ్గింది’ అని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది.


