News April 4, 2025
బిజినేపల్లిలో ఏప్రిల్ 22న జాతీయ సెమినార్

బిజినేపల్లి మండలం పాలెం శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ సైన్స్ అండ్ ఆర్ట్స్ అటానమస్ కళాశాల ఏప్రిల్ 22న ఒకరోజు జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు. సెమినార్ బ్రోచర్ను అధ్యాపకులతో విడుదల చేసిన ఆయన ఈ సెమినార్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిధులతో నిర్వహిస్తున్నామన్నారు. సెమినార్లో పరిజ్ఞానం ఉన్న ఏ టీచరైనా ఈనెల 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
Similar News
News December 1, 2025
జగిత్యాల: 3,536 పోలింగ్ స్టేషన్లకు 110 మైక్రో అబ్జర్వర్లు

జగిత్యాల జిల్లా కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారి పాత్ర కీలకమని, చెక్లిస్ట్ ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో 3,536 స్టేషన్లకు 110 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించినట్టు తెలిపారు. సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
News December 1, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, భద్రత, సభాస్థలి, రవాణా నిర్వహణ వంటి అంశాలను అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. రేపు జరగనున్న ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి లోపాలు లేకుండా పనిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.
News December 1, 2025
సంస్కరణల ప్రభావం.. నవంబర్లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నవంబర్ వసూళ్లపై పడింది. అక్టోబర్లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లవ్వగా నవంబర్లో రూ.1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. 2024 నవంబర్లో రూ.34,141 కోట్లుగా ఉన్న CGST వసూళ్లు ఈ ఏడాది రూ.34,843 కోట్లకు పెరిగాయి. అయితే, SGST వసూళ్లు మాత్రం రూ.43,047 కోట్ల నుంచి రూ.42,522 కోట్లకు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,093 కోట్ల నుంచి రూ.46,934 కోట్లకు పడిపోయాయి.


