News February 14, 2025
బిజినేపల్లి: అనుమానాస్పదంగా మహిళ మృతి

నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్లో అనుమానాస్పదంగా మహిళ మృతి చెందింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ(55) బుధవారం రాత్రి భర్త సుల్తాన్ పొలానికి వెళ్లగా ఒంటరిగా పడుకుంది. ఉదయం భర్త ఇంటికి వచ్చిన సమయంలో ఆమె గాయాలతో ఉంది. వెంటనే నాగర్కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బిజినేపల్లి ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 24, 2025
రాజమండ్రి: 27న ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు

జిల్లాలో వివిధ కారణాలు వల్ల ఖాళీగా ఉన్న 12 ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీపీవో శాంతామణి అన్నారు. రాజమండ్రి డివిజన్లో మల్లవరం, పాతతుంగపాడు, లక్ష్మినరసాపురం, మర్రిపూడి, మురమండ, మునికుడలి, కొవ్వూరు డివిజన్లో పెనకనమెట్ట, కొవ్వూరుపాడు, గోపాలపురం, వెంకటాయపాలెం, తాడిపూడి, ఉంద్రాజవరం పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. EOPR&RD ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.
News March 24, 2025
మళ్లీ సొంతగూటికేనా!

కాపు రామచంద్రారెడ్డి తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాయదుర్గం YCP ఇన్ఛార్జిగా ఉన్న గోవిందరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. ఇదే సమయంలో తనకు BJPలో తగిన గుర్తింపు లభించకపోవడంతో రామచంద్రారెడ్డి తిరిగి YCPలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాల టూర్లో వైసీపీలో కండువా కప్పుకునే అవకాశముంది.
News March 24, 2025
ఈ ఏడాదిలో ఇదే చివరి వారం

అదేంటీ ఇది మార్చి నెలే కదా అనుకుంటున్నారా. మన తెలుగు సంవత్సరం అయిన ‘క్రోధినామ’ సంవత్సరం ఈనెల 29న పూర్తి కానుంది. అంటే ఈ ఏడాదిలో ఇదే చివరి వారం. వచ్చే ఆదివారం 30న ఉగాది సందర్భంగా తెలుగువారంతా ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగుపెడతారు. పూర్తిగా ఇంగ్లిష్ క్యాలెండర్కు అలవాటుపడ్డ మనం తెలుగు సంవత్సరాలు, పంచాంగం, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమంటారు?