News February 6, 2025

బియ్యం అక్రమరవాణా తగదు: జేసీ అభిషేక్ కుమార్

image

జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని సివిల్ సప్లై, డిప్యూటీ తహశీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిత్యావసర సరకుల పంపిణీలో ఎలాంటి అక్రమ లావాదేవీలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.

Similar News

News November 13, 2025

విశాఖలో నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్..

image

CII సమ్మిట్‌కు ముందుగా దేశంలోని ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, CEOలు, విదేశీ రాయబారులతో CM చంద్రబాబు నేడు భేటీ కానున్నారు.
➣ఉదయం నోవాటెల్‌లో ఇండియా-యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం
➣‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’- సస్టైనబుల్ గ్రోత్‌పై ప్రారంభ సెషన్‌
➣మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో భేటీ
➣ సాయంత్రం‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’పై కార్యక్రమం
➣ CII నేషనల్ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం

News November 13, 2025

WGL: 24 అంతస్తుల్లో ఆసుపత్రి ఉన్నట్టా? లేనట్టా..?

image

హెల్త్ హబ్ కాస్త ఐటీ హబ్‌గా మారబోతుందా? అంటే అవుననే తెలుస్తోంది. WGL ఎంజీఎం స్థానంలో 2,200 పడకలతో 24 అంతస్తుల్లో రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భవనం ఆసుపత్రి కోసం కాదా అనే అనుమానాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం మొదలు పెట్టిన ఈ భవనం కాంగ్రెస్ హయాంలో ఆసుపత్రికి కాకుండా ఐటీ హబ్‌గా మారిస్తే చాలా మంచిదని ఇటీవల కొందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టు తెలిసింది. దీనిపై మీ కామెంట్?

News November 13, 2025

బీపీఎస్ గడువు పొడిగింపు!

image

AP: అనుమతులు తీసుకోకుండా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2025 ఆగస్టు 31లోపు కట్టిన ఇళ్లు, భవనాలను బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్)లో క్రమబద్ధీకరించుకునేలా అవకాశమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. 4 నెలల్లోగా అప్లై చేసుకోవాలని తెలపింది. ఈ పథకం ద్వారా 59,041 అనధికార నిర్మాణాలకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వెబ్ సైట్: <>www.bps.ap.gov.in<<>>