News February 26, 2026
బిల్డింగులు కట్టుకునేవారికి అనుమతులు తప్పనిసరి: కలెక్టర్

ఇంటిపన్ను చెల్లించేవారు, కొత్త బిల్డింగులు కట్టుకునేందుకు పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తద్వారా పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీసీ నిర్వహించారు. జీఎస్టీ రెవెన్యూ పెంచడానికి అన్ని శాఖలు కలిసికట్టుగా పని చేయాలన్నారు.
Similar News
News April 15, 2026
నేడు ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కల్లూరులో CHC ప్రారంభం, పెనుబల్లిలో ఏర్పాటు చేసే ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతుల కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం వేంసూరు మండలంలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు.
News April 15, 2026
WGL: ఆరు స్థానాలు పెరగడం పక్కా!

ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 6 కొత్తవి రావడం పక్కాగా తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 35,12,576 మంది కాగా, 17,59,772 పురుషులు, 17,53,295 మహిళలున్నారు. ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా, కొత్తవి 6 రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉన్న 12 స్థానాల్లోని జనరల్ స్థానాలన్నీ మహిళలకు, రిజర్వు స్థానాలు జనరల్గా మారడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటి నుంచే నేతలు వాటిపై గురి పెడుతున్నారు.
News April 15, 2026
ఖమ్మం: కళ తప్పిన జంట నగరాలు

వేలాది కార్మికులతో కళకళలాడిన కొత్తగూడెం, పాల్వంచ నగరాలు నేడు కళావిహీనంగా మారాయి. సింగరేణి గనుల మూత, కేటీపీఎస్ పాతప్లాంటు తొలగింపుతో కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. దీని ప్రభావం వర్తక, రియల్ ఎస్టేట్ రంగాలపై పడి వ్యాపారాలు కుదేలయ్యాయి. కార్పొరేషన్గా ఏర్పడినా అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్థానికులు వాపోతున్నారు. జిల్లాలో కొత్త ప్రాజెక్టుల ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.


