News February 16, 2026
బిల్ గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్

గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.
• అమరావతి రాజధాని ప్రణాళికలను.. బ్లూ-గ్రీన్ కాన్సెప్టు, అత్యాధునిక పద్దతుల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న విధానాన్ని తెలుసుకున్న బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ రాజధాని మాస్టర్ ప్లాన్ను మెచ్చుకున్నారు.
• రాజధాని ప్రాంతంలో మొత్తంగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించే దిశగా.. ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు గేట్స్కు సీఎం వివరించారు.
Similar News
News March 17, 2026
నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేటి పర్యటన వివరాలు ఖరారయ్యాయి. ఉదయం 11 గంటలకు ఆయన రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం 11.30 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) పనితీరుపై అధికారులతో ఆయన కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3.20 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.
News March 17, 2026
ఏపీ ఎంపీల ప్రగతి నివేదిక.. మన గుంటూరు ఎంపీ టాప్

ఎంపీల పనితీరుపై ‘రైజ్’ సంస్థ తాజా నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ 8.9 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు 8.7 స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ 8.1 స్కోరుతో మూడో స్థానంలో ఉన్నారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (8.0), తిరుపతి ఎంపీ గురుమూర్తి (7.8) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
News March 17, 2026
GNT: రూ.10 కోట్లతో ఫైనాన్స్ యజమాని పరార్

లక్ష పెడితే నెలకు రూ. 10 వేల లాభమంటూ నమ్మించిన ఓ ఫైనాన్స్ సంస్థ యజమాని వందల మందికి టోకరా వేశాడు. గుంటూరు అరండల్పేటలో ‘ట్రేడ్ దోస్త్’ పేరుతో సంస్థ నడిపిన బాపట్లకు చెందిన వెంకట పూర్ణచంద్రరావు.. ఏజెంట్ల ద్వారా సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.


