News April 24, 2024
బీఆర్ఎస్కు మనస్తాపంతో రాజీనామా చేశా: మాజీ ఎమ్మెల్యే

వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అనేక సమస్యలపై తమ వంతుగా కృషి చేశానని వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. కొన్ని రాజకీయ పరిణామాలతో తనకు గుర్తింపు లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. సోమవారం వైరాలో ఆయన సంబంధించిన వర్గీయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని అనేకమంది నాయకులు ప్రజాప్రతినిధులు రాములు నాయక్ మద్దతుగా నిలిచారు.
Similar News
News December 12, 2025
బోనకల్ సర్పంచ్గా భార్య, వార్డు సభ్యుడిగా భర్త విజయం

బోనకల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ జ్యోతి సర్పంచ్గా ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి భూక్య మంగమ్మపై 962 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈ విజయం కంటే ఆసక్తికరంగా, జ్యోతి భర్త బాణోత్ కొండ 4వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఈ అపూర్వ విజయంతో గ్రామంలో వారి అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
News December 12, 2025
ఖమ్మం: నేటితో రెండో విడత ప్రచారం ముగింపు

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచార గడువు నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం వంటి 6 మండలాల్లో అభ్యర్థులు చివరి రోజు ఇంటింటి ప్రచారానికి పదును పెడుతున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహాలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
News December 12, 2025
KMM: తొలివిడతలో సత్తా చాటిన కాంగ్రెస్ అభ్యర్థులు

ఖమ్మం జిల్లాలో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (7 మండలాల్లో) కాంగ్రెస్ పార్టీ-136, బీఆర్ఎస్-34, సీపీఐ-6, సీపీఎం-10, టీడీపీ-2, ఇండిపెండెంట్-4 స్థానాల్లో విజయం సాధించారు. అధికంగా వైరా మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయితీల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఎం-1, బీఆర్ఎస్- 1 స్థానాల్లో నిలిచారు.


