News March 25, 2024

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌‌వి అబద్ధపు ప్రచారాలు

image

నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. నల్గొండలో శనివారం ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ 6 పథకాలు అమలు చేయలేదు. వంద రోజుల్లో వంద రూపాయల పని కూడా జరగలేదు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన రోజునే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.

Similar News

News November 21, 2025

మార్కెట్లో మండిపోతున్న కూరగాయల ధరలు

image

నల్లగొండ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి కూరగాయల ధరలు సామాన్యుడికి అందకుండా పైపైకి ఎగబాకుతున్నాయి.టమాటా కిలో 50 రూపాయలు,చిక్కుడుకాయ కిలో 140, గోకర, బెండకాయ,బీరకాయ కిలో 120, దోసకాయ కిలో 60, వంకాయ కిలో 80, క్యారెట్ కిలో120 రూపాయలకు అమ్ముతున్నారు.దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇటీవల తుఫాను ప్రభావంతోనే కూరగాయల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

News November 21, 2025

దేవరకొండ ASP మౌనిక ఆదిలాబాద్‌కు బదిలీ

image

దేవరకొండ ఏఎస్పీ మౌనిక బదిలీ అయ్యారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆమె ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన వారిలో ఆమె ఒకరు. ఏఎస్పీగా ఇక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.

News November 21, 2025

NLG: వడివడిగా అడుగులు… ఏర్పాట్లపై ఈసీ కసరత్తు

image

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడుగులు చకచకా పడుతున్నాయి. తొలుత GP ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి రాగా ఎన్నికల సంఘం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనెల 23న జిల్లాలో ఓటర్ల తుది జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల వివరాలను విడుదల చేయనున్నారు. ఇతర ఏర్పాట్లపైనా దృష్టి సారించగా.. ఈనెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.